HYD: ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీ, శ్రీ శివాలయం ప్రాంగణంలో గల అయ్యప్ప స్వామి ఆలయంలో, 20 డిసెంబర్ 2024 శుక్రవారం రోజు ఉదయం, అయ్యప్ప మాలదారులు అయ్యప్ప స్వామి వారికి అభిషేకం చేశారు. తదుపరి స్వామి వారిని పూలమాలతో అలంకరించారు. 18 మెట్లపై పూలు పెట్టారు. దీపారాధన చేసి స్వామివారిని పూజించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ చేసి, శబరిమల బయలుదేరారు.
BDK: పాల్వంచ మండల పరిధిలోని కేశవాపురం, జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువైన పెద్దమ్మతల్లికి ఈరోజు ఉదయం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా అమ్మవారికి హారతి, మంత్రపుష్పం, నివేదన, నీరాజనం పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలు ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
PLD: పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలోని శ్రీ భగలాముఖి అమ్మవారి ఆలయంలో శుక్రవారం బండ్లమ్మ తల్లికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పట్టు చీర, బంగారు ఆభరణాలతో ప్రత్యేక అలంకరణ చేసి ఐశ్వర్య ప్రదాయినిగా భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి విచ్చేసిన భక్తులకు నైవేద్యాలు సమర్పించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.
CTR: పుంగనూరు పట్టణం పాత బస్టాండ్ సమీపాన గల శ్రీ విరుపాక్షి మారెమ్మ ఆలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయాన్నే ఆలయ అర్చకులు అమ్మవారిని అభిషేకించి, ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలను అర్చకులు పంపిణీ చేశారు.
ATP: అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో ధనుర్మాస పూజలు చేశారు. ఆలయంలో అమ్మవారి మూలమూర్తికి వేకువజామున సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అర్చకులు అభిషేకాలు నిర్వహించారు. ఆలయంలో భక్తాదులు విష్ణు సహస్రనామ పారాయణం, లక్ష్మీ అష్టోత్తర శతనామ పారాయణం గావించారు.
ATP: రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే శుక్రవారం వందలాది భక్తుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చందనాభిషేకంలో స్వామివారు భక్తులకు కనువిందు చేశాడు. అంతకుముందు స్వామివారికి పంచామృతా, కుంకుమార్చనలు తోమాల సేవ తదితర పూజలు నిర్వహించారు.
KRNL: రాష్ట్రంలోని మసీదులలో పనిచేసే ఇమామ్, మోజన్లకు గౌరవవేతనాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 131 జారీ చేసినట్లు రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. అమరావతిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఇమామ్లకు రూ. 10వేలు, మోజన్లకు రూ. 5వేల వేతనాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం తీగుల్ నరసాపూర్ శివారులోని కొండపోచమ్మ ఆలయం వద్ద శుక్రవారం బహిరంగ వేలం పాటలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో రవికుమార్ తెలిపారు. ప్రతి ఏటా ఆలయం వద్ద వేలం పాటలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆలయం వద్ద 11 రకాలకు సంబంధించిన వాటికి వేలం పాట వేయనున్నామన్నారు. వేలం పాటల్లో డిపాజిట్ చెల్లించి పాల్గొనాలని ఈవో సూచించారు.
BDK: పాల్వంచ మండలం జగన్నాధపురం గ్రామంలో వెలసిన శ్రీ కనకదుర్గ(పెద్దమ్మ తల్లి) అమ్మవారి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు అమ్మవారికి నీరాజనం, నివేదన, మంత్రపుష్పం, హారతి సమర్పించారు. అనంతరం అమ్మవారికి ఆలయ అర్చకులు 108 పుష్పాలతో సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. ఈ పూజలలో ఆలయ కార్యనిర్వహణాధికారి, భక్తులు పాల్గొన్నారు.
KRNL: బనగానపల్లె మండలంలోని యాగంటి క్షేత్రంలో గురువారం శ్రీఉమామహేశ్వర స్వామి అమ్మవార్లకు నిత్య పూజలు కొనసాగాయి. ఇందులో భాగంగానే ప్రాతఃకాల సమయం నుంచి స్వామి అమ్మవార్లకు అభిషేకాలు, అర్చనలు తదితర పూజ క్రతువులను శాస్త్రోక్తంగా చేపట్టారు. అదేవిధంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ నిర్వహించి విశేష పూజలు జరిపారు.
JGL: ధర్మపురి గోదావరి తీరంలో గల శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో గురువారం ఉదయం ధనుర్మాసం ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. సీతారాముల మూల విగ్రహాలకు అర్చకులు తాడూరి రఘునాథ శర్మ వేదోక్తంగా పంచామృతాలతో క్షీరాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలంకరణ స్వామివారి అష్టోత్తర శతనామార్చనలు నివేదన మంగళ హారతి మంత్రపుష్పం తీర్థ ప్రసాదాల వితరణ గావించారు.
GNTR: పవిత్ర పుణ్యక్షేత్రమైన అమరావతిలో కొలువైన శ్రీ బాల చాముండికా సమేత శ్రీ అమరేశ్వరస్వామి వారి దేవస్థానంలో బుధవారం సంకటహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానంలోని ఉపాయంలో వినాయకుడికి ప్రత్యేక అలంకరణ చేసి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని పెద్ద ఎత్తున దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
AP: విజయవాడ ఇంద్రకీలాద్రి భవానీ దీక్షల విరమణకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈనెల 21 నుంచి 25వ తేదీ వరకు భవానీ దీక్షలు విరమించనున్నారు. ఈసారి 60 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని దుర్గగుడి ఈవో రామారావు తెలిపారు. భక్తుల కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్లు, కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశామని కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు.