TG: నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారి దర్శనానికి భారీగా తరలొస్తున్నారు. తెల్లవారుజామున 2 గంటల నుంచే అమ్మవారి దర్శనాలు ప్రారంభమయ్యాయి. అలాగే, అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీతో మండపాలు కిటకిటలాడుతున్నాయి. అమ్మవారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతున్నట్లు ఆలయ అధికారు...
కృష్ణా: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూలా నక్షత్రం రోజు చాలా ప్రత్యేకమైనదని దేవదాయ శాఖ మంత్రి రామనారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూలా నక్షత్రం రోజున అందరికీ అమ్మవారి దర్శనం అన్ని క్యూ లైన్లలో కూడా ఉచితంగానే ఉంటుందని స్పష్టం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తారని, భక్తులకు ఇబ్బంది లేకుండానే ఏర్పాట్లు చేశామన్నారు.
AP: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో ఇవాళ కీలకఘట్టం ఆవిష్కృతం కానుంది. జ్ఞానప్రదాయిని సరస్వతీ దేవి అలంకరణలో కనకదుర్గమ్మ దర్శనమివ్వనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు మధ్యాహ్నం 2 గంటలకు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. మూలానక్షత్రం రోజు అమ్మవారిని దర్శంచుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తారని, అందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు దుర్గామల్లేశ్వర ఆలయ ఈవో కేఎస్ రామారావు ...
శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; శరదృతువు, ఆశ్వయుజమాసం, శుక్లపక్షం షష్ఠి: ఉ. 7-24 తదుపరి సప్తమి మూల: రా. 1-29 తదుపరి పూర్వాషాఢ వర్జ్యం: ఉ. 9-02 నుంచి 10-41 వరకు తిరిగి రా. 11-50 నుంచి 1-29 వరకు అమృత ఘడియలు: సా. 6-54 నుంచి 8-33 వరకు దుర్ముహూర్తం: ఉ. 11-24 నుంచి 12-11 వరకు రాహుకాలం: మ. 12-00 నుంచి 1-30 వరకు సూర్యోదయం: ఉ. 5.55; సూర్యాస్తమయం: సా.5.41. సరస్వతీపూజ, […]
SRCL: వేములవాడ రాజన్న ఆలయంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆరవ రోజు ఆశ్వీజ శుద్ధ పంచమి నేపథ్యంలో మంగళవారం శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు కాత్యాయని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంకాలం పట్టణ పురవీధుల గుండా నెమలి వాహనంపై హరిహరులు విహరించనున్నారు. ఉదయం గాయత్రి హోమంతో పాటు ప్రత్యేక అభిషేక పూజలు అర్చకులు నిర్వహించారు.
AP: తిరుమల బ్రహ్మోత్సవాలకు ప్రారంభం ముందు అపశ్రుతి చోటు చేసుకుంది. సాయంత్రం నిర్వహించే ధ్వజారోహణ ధ్వజస్తంభంపై ఉండే ఇనుప కొక్కి విరిగిపోయింది. ఈ కొక్కి సహాయంతోనే అర్చకులు గరుడ పతాకాన్ని ఎగురవేస్తారు. అయితే అర్చకులు కొక్కిని పునరుద్దరించే పనులను ప్రారంభించారు.
TG: మెదక్ జిల్లాలోని ఏడుపాయల దుర్గాభవానీ ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. మంజీర నది ఏడుగా చీలిన పాయల్లో ఆలయం ఉండటంతో.. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి నదికి వరద పోటెత్తి.. ఆలయం వరద నీటిలో చిక్కుకుపోతుంది. అయితే, దసరా ఉత్సవాల్లో భాగంగా శరన్నవరాత్రి ఉత్సవాలు జరగాల్సి ఉండగా వరదనీరు అడ్డంకిగా మారింది. దీంతో రాజగోపురంలో అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు. ఇవాళ గాయత్రీదేవి అలంకారంలో ఏడుపాయల అమ్మవారు దర్...
BHNG: యాదాద్రి కొండపై శ్రీవారి అనుబంధ ఆలయమైన పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు ఉదయం విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, పంచగవ్యప్రాసన, అఖండ దీపారాధన కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అనువంశిక ధర్మకర్త, ఈవో, అధికారులు, అర్చకులు, పురోహితులు, వేద పండితులు పాల్గొన్నారు.
KDP: సిద్దవటం మండలంలోని మాధవరం-1లోని శ్రీ మంగళ గౌరీ దేవి ఆలయంలో దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకొని గురువారం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు అమ్మవారి మూల విరాటుకు పలు అభిషేకాలు నిర్వహించి పూలతో అలంకరించారు. మొదటి రోజు బాలా త్రిపురా సుందరి దేవి అలంకారంతో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
కర్నూలు: దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం మాచవరం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వాసవి అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా, శివాలయంలోని భ్రమరాంబ అమ్మవారిని భ్రమరాంబికా దేవిగా ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆయా దేవాలయాల్లో అమ్మవార్లకు నూతన వస్త్రాలతో, ప్రత్యేక పూలతో సుందరంగా అలంకరించారు. మహిళలు కుంకుమ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
కర్నూలు: కొలిమిగుండ్ల మండలం బెలుం గ్రామంలో వెలిసిన సత్యమ్మ అమ్మవారికి దేవి నవరాత్రులను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.
ప్రకాశం: విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆలయాలు వేడుకలకు ముస్తాబయ్యాయి. త్రిపురాంతకంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాలా త్రిపురసుందరీ దేవి ఆలయంలో గురువారం నుంచి ఈ నెల 12వ తేదీ వరకు వివిధ రకాల పూజలు నిర్వహించనున్నారు. 9 రోజులు పాటు ప్రత్యేక అలంకరణతో అమ్మవారు దర్శనమివ్వనున్నారు.
ELR: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న విజయదుర్గా ఆలయంలో గురువారం నుంచి దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయం నుంచి పట్టణ పుర వీధుల్లో పల్లకి సేవ నిర్వహించారు. కలశాలు నెత్తిపై పెట్టుకుని పల్లకి ఊరేగింపు చేశారు. అలాగే ఆలయంలో దసర ఉత్సవాల సందర్భంగా 9 రోజుల పాటు వివిధ అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారని తెలిపారు.
W.G: పశ్చిమగోదావరి జిల్లా కాళ్ళ మండలం కాళ్ళకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ అమ్మవారిని ఆదిలక్ష్మిగా అలంకరించారు. అనంతరం ఆలయ వేద పండితులు అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి, భక్తులకు దర్శనం కల్పించారు.
MDK: పాపన్నపేట మండలం ఏడు పాయల ఆలయంలో బాల త్రిపుర సుందరిగా వన దుర్గమ్మ దర్శనం ఇచ్చారు. అర్చక బృందం ఆధ్వర్యంలో గురువారం శ్రీ దేవి శరన్నవరాత్రోత్సవ కార్యక్రమాలు ప్రారంభించి విశేష పూజలు చేశారు. అనంతరం మంగళహారతి నైవిద్యం సమర్పించారు.