HNK: ఒకే వేదికపై కాంగ్రెస్ పార్టీ MLA, BRS మాజీ MLA కనిపించిన దృశ్యం శనివారం చోటు చేసుకుంది. ACP క్రైమ్ వరంగల్ సదయ్య కుమార్తె వివాహ వేడుక నేడు ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పరకాల MLA రేవూరి ప్రకాశ్ రెడ్డి, భూపాలపల్లి మాజీ MLA గండ్ర వెంకటరమణ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఇరువురు నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
NGKL: జిల్లాలోని అన్ని గ్రామాల్లో మిషన్ భగీరథ తాగునీటి సర్వేను పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. బిజినేపల్లి మండలంలోని వట్టెం, రాంరెడ్డిపల్లి గ్రామంలో కొనసాగుతున్న మిషన్ భగీరథ తాగునీటి ఇంటింటి సర్వేను శనివారం కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు.
MDK: నిజాంపేట నూతన మండలంగా ఏర్పడి 12 ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ ఆధార్ సెంటర్ ఏర్పాటు కాకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని 16 గ్రామ పంచాయతీల ప్రజలు ఆధార్ అప్డేట్స్, కొత్త కార్డుల కోసం దుబ్బాక, రామాయంపేట, మెదక్ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు.
ADB: నేషనల్ హెల్త్ మిషన్ (NHM)లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ కోరారు. శనివారం ఎమ్మెల్యే పాయల్ శంకర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా తెలంగాణలోనూ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, ఆరోగ్య ప్రయోజనాలు కల్పించాలని కోరారు.
NLG: చిట్యాల మండలం వెంబావి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణకు ఇవాళ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఐసీడీఎస్ సూపర్ వైజర్ సునీత తెలిపారు. సర్పంచ్ గుణగంటి అలివేలు వెంకన్న ఛైర్మన్గా, వార్డు సభ్యుడు బంగారెక్క ప్రసాద్ వైస్ ఛైర్మన్గా, అంగన్వాడీ టీచర్ సునీత కన్వీనర్గా, హెచ్ఎం అరుణ, ఆశా వర్కర్లు, తల్లులు కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు.
KNR: తిమ్మాపూర్ మండలం మహాత్మనగర్ గ్రామంలో టీజీఈడబ్ల్యూఐడీసీ శాఖ ఆధ్వర్యంలో రూ. 13 కోట్ల వ్యయంతో డైట్ క్యాంపస్ అభివృద్ధి మరియు డైట్ ఆఫ్ ఎక్సలెన్స్ అప్గ్రేడేషన్ పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ హాజరై శంకుస్థాపన చేశారు.
BDK: ఇల్లందులో జామాయిల్ కర్రలు నరకడానికి వెళ్లిన ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన గిరిజన యువకుడు విద్యుత్ షాక్కు గురై శనివారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన ఐటీసీ జామాయిల్ సప్లై చేసే ఓ కాంట్రాక్టర్ ఆ మృతికి తనకేమీ సంబంధం లేదని ఎటువంటి అగ్రిమెంట్లు లేవని తీర్చి చెప్పినట్లు స్థానికులు తెలిపారు.
కామారెడ్డి: లింగంపేట మండల సర్పంచ్ల ఫోరం నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సక్రు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనను మండల సర్పంచులు అభినందించారు. అనంతరం అధ్యక్షుడు మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో అధ్యక్షుడిగా ఎన్నుకున్నా ప్రతి ఒక్కరికి ఎంతో రుణపడి ఉంటానని చెప్పారు. సర్పంచుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
SRPT: మట్టపల్లి మండలంలో ఉన్న అయ్యప్ప ఆగ్రో ఏజెన్సీలో నిషేధిత బయో పురుగుమందులు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుంటూరు నుండి తెచ్చిన బయో రసాయనాలను స్థానికంగా విక్రయిస్తూ, ముఖ్యంగా వరి పంటలకు విస్తృతంగా పిచికారి చేస్తున్నారనే వాదనలు రైతుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. వెంటనే సంబంధిత అధికారులు ఆ షాప్పై రైడ్ నిర్వహించాలని రైతులు కోరుతున్నారు.
NGKL: కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లిలో మంత్రి జూపాలి కృష్ణారావు గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. గ్రామస్థాయిలో విద్య, వైద్యం, విద్యుత్ సరఫరా, ఆర్టీసీ బస్సుల సౌకర్యాం వంటి వసతులపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలని, పెండింగ్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
JGL: పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల మండలంలోని హనుమాజీపేట గ్రామంలో బొడ్డు మౌనిక-సురేశ్ల ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు. సర్పంచ్ బొడ్డు దామోదర్, అంజా గౌడ్, నక్క సతీశ్ పాల్గొన్నారు.
PDPL: ధర్మారం మండలం ఖానంపల్లి గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో శనివారం చిన్నారులు, గర్భిణీలకు అందిస్తున్న పౌష్టికాహారం, కోడిగుడ్లు, బలామృతం పంపిణీని పరిశీలించారు. సర్పంచ్ కాల్వ సుగుణ–మల్లయ్య, ఉపసర్పంచ్ బెజ్జెంకి యమున–రాజేందర్ సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సతీష్, వార్డు సభ్యులు, అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.
WGL: రసాయన ఎరువులను తగు మోతాదులోనే వాడాలని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రైతులకు సూచించారు. నల్లబెల్లి మండల కేంద్రంలోని కొండయిలపల్లి గ్రామంలో మిర్చి రైతులకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. అధిక రసాయనులు వాడడం వలన పంట దిగుబడి సరిగ్గా రాదని పేర్కొన్నారు. రైతులు రసాయన ఎరువులు తగ్గించాలని కోరారు.
జనగామ మండలం వెంకిర్యాల గ్రామానికి తాళ్లపల్లి నరసింహులు వేరికోసిల్ (కాళ్ల నరాల) సంబంధిత వ్యాధితో బాధ పడుతూ అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స కోసం పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం పడగా విషయాన్ని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన వారు రూ.2 లక్షల LOCని మంజూరు చేయించి, నేడు అందజేశారు.
కామారెడ్డి: జిల్లా నుంచి 11 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి యోగాసనా పోటీలకు ఎంపికయ్యారని జిల్లా యువజన స్పోర్ట్స్ అధికారి శ్రీరంగ వేంకటేశ్వర్ గౌడ్ తెలిపారు. ఈ యోగాసనా పోటీలు నేటి నుంచి 23 వరకు రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ స్టేడియంలో జరగనున్నాయని తెలిపారు. కామారెడ్డి జిల్లాకు స్వర్ణ, రజక పతకాలు తీసుకురావాలని ఆయన కోరారు.