WNP: పెబ్బేరు మండలంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆదివారం బీజేపీ నాయకుల పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో పండిత్ దిన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వివిధ అంశాలపై వక్తలు దిశా నిర్దేశం చేశారు. బీజేపీ ప్రభుత్వ పథకాలను ప్రజలకు ఏ విధంగా తీసుకువెళ్లాలో ఆయన వివరించారు.
BHNG: రామన్నపేట నియోజకవర్గాన్ని పునరుద్ధరించాలని, గత కాలం నుంచి వెనకబడిన రామన్నపేట ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సీపీఎం మండల కార్యాలయంలో జరిగిన పార్టీ మండల కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. పాత నియోజకవర్గంగా వెలిసిలిన రామన్నపేట ఇవాళ మండల కేంద్రంగా ఉందని అన్నారు.
NZB: NZB ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బుద్దరాజు ఉత్తమ కళాశాల అవార్డును అందుకున్నారు. జిల్లా ఇంటర్ విద్యా అధికారి రవికుమార్తో పాటు NZB, KMR జిల్లాల ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపళ్లు అభినందించారు. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను ఉత్తమ కళాశాలగా ఎంపిక చేయగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ అవార్డు ఆదివారం అందజేశారు.
PDPL: ధర్మారం మండలం పత్తిపాక గ్రామ పంచాయితీ కార్యాలయంలో రేపు ఉదయం 10 గంటలకు కూరగాయల వారసంత బహిరంగ వేలంపాట నిర్వహించనున్నట్లు కార్యదర్శి కిరణ్ తెలిపారు. ఆసక్తిగలవారు రూ. 2000 డిపాజిట్ చెల్లించి వేలం పాటలో పాల్గొనాలని సూచించారు. అలాగే గ్రామ పంచాయతీకి ఎటువంటి బకాయిలు ఉండరాదని పేర్కొన్నారు.
NGKL: తిమ్మజిపేట మండలం ఆవంచ గ్రామంలో మాజీ మంత్రి సి. లక్ష్మారెడ్డి సతీమణి కీ.శే.శ్రీమతి చర్లకొల శ్వేత గారి స్మారకార్ధం నిర్వహిస్తున్న వాలీబాల్ టోర్నమెంటును ఇవాళ మాజీ మంత్రి ప్రారంభించారు. ఈ టోర్నీలో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల నుంచి మొత్తం 35 టీంలు పాల్గొన్నాయి. టోర్నీలో పాల్గొంటున్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ADB: ఆదివాసీల హక్కులు, సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా ఉద్యమించాలని ఆదివాసుల పోరాట హక్కుల తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గణేష్ అన్నారు. ఆదివారం ఇంద్రవెల్లి మండలంలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ ఛైర్మన్ నాగ్ నాథ్, గౌరవాధ్యక్షుడు నాగోరావ్, ప్రధాన కార్యదర్శి తులసిరామ్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు.
MDK: తూప్రాన్ పెద్ద చెరువు కట్ట బతుకమ్మ ఘాట్లో శివంపేట మండలం దంతాన్ పల్లికి చెందిన గజేంద్రుల బాలమని (75) చెరువులో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన ఓ వ్యక్తి 100 డయల్ చేయడంతో పోలీసులు రవి, మహేష్ అక్కడికి వెళ్లి ఆమెను రక్షించి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆమె కుమారుడు శంకర్కు ఆమెను అప్పగించారు
KNR: సుందరగిరిలో గొర్రెలు, మేకల వారసంత వేలంపాటను శనివారం నిర్వహించారు. ఇందులో మొత్తం ఆరుగురు పోటీపడగా హుస్నాబాద్కు చెందిన ఐలేని కిషన్ రెడ్డి అత్యధికంగా రూ.7.73 లక్షలకు వేలం కైవసం చేసుకున్నారు. గతేడాదితో (రూ.7 లక్షలు) పోలిస్తే ఈసారి రూ.73 వేలు అదనంగా రావడం గమనార్హం. సంతను సక్రమంగా నిర్వహించాలని సూచిస్తూ కిషన్ రెడ్డిని మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాల్గొన్నారు.
SRCL: శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ దేవాలయమైన బద్ది పోచమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు భక్తిశ్రద్ధలతో నైవేద్యం వండి బోనం తయారుచేసి ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. అమ్మవారికి బోనం, పసుపు కుంకుమలు, ఒడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
MBNR: దేవరకద్ర నియోజకవర్గంలోని కౌకుంట్ల, చిన్నచింతకుంట, మూసాపేట్ మండలాల్లో బీజేపీ ‘ప్రశిక్షణ మహా అభియాన్’ శిక్షణ తరగతులు రెండో రోజు ఉత్సాహంగా కొనసాగాయి. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎగ్గని నరసింహులు మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి, సిద్ధాంత అవగాహనకు ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు అత్యంత కీలకమని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
BDK: భద్రాచలం తహశీల్దార్ కార్యాలయంలో రేపు ఉదయం 10:30 గంటల నుంచి ‘ప్రజావాణి’ నిర్వహించనున్నట్లు తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల మండల అధికారులు హాజరవుతారని, ప్రజలు తమ సమస్యలపై నేరుగా దరఖాస్తులు అందజేయవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
KMR: రాజంపేట మండలం గుండారంలో దివ్యాంగులకు ఏపీడీ విజయలక్ష్మీ వీల్ చైర్లు అందజేశారు. మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గుండారం గ్రామ సంఘం సర్పంచ్ శంకరమ్మ, ఉప సర్పంచ్ శ్యామయ్య, వార్డు సభ్యులు, ఐకేపీ ఏపీఎం రాజారెడ్డి, మండల సమైక్య అధ్యక్షురాలు సుతారీ లక్ష్మీ, సీసీ సాయిలు, గ్రామ సంఘం అధ్యక్షులు యాదమ్మ, సంతోషిని, అనిత పాల్గొన్నారు.
BHNG: రాచకొండలో రిజర్వాయర్ ఏర్పాటు చేసి సంస్థాన్ నారాయణపురం మండలానికి సాగునీరు అందించాలని CPI చేపట్టిన ప్రచార జాత ఆదివారంతో రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా CPI జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చనగోని గాలయ్య మాట్లాడుతూ.. సోమవారం ఉదయం 10 గంటలకు తహసీల్దార్ కార్యాలయం ముందు నిర్వహించబోయే మహా ధర్నా కార్యక్రమానికి రైతులంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
PDPL: విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్ 8న రాఘవాపూర్ డివిజన్ కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహించనున్నట్లు టీవీఏఈజేఏసీ జిల్లా కన్వీనర్ కిషన్ రెడ్డి తెలిపారు. ఆర్టిజన్ కార్మికుల కన్వర్షన్, పీఆర్సీ-2026 అమలు చేయాలని ఆదివారం డిమాండ్ చేశారు. కార్మికుల జీవితాల్లో చీకట్లు నింపే యాజమాన్య తీరుకు నిరసనగా అందరూ ధర్నాలో పాల్గొనాలన్నారు.
HNK: బీజేపీ పార్టీకి కార్యకర్తలే అసలైన పట్టుకొమ్మలు అని మాజీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. హంటర్ రోడ్డులో నిర్వహించిన ముఖ్య నేతల సమావేశంలో పద్మ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ‘ఆత్మనిర్బార్ భారత్’ లక్ష్యసాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేస్తూ సమిష్టిగా ముందుకు సాగాలని, బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు.