PDPL: విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్ 8న రాఘవాపూర్ డివిజన్ కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహించనున్నట్లు టీవీఏఈజేఏసీ జిల్లా కన్వీనర్ కిషన్ రెడ్డి తెలిపారు. ఆర్టిజన్ కార్మికుల కన్వర్షన్, పీఆర్సీ-2026 అమలు చేయాలని ఆదివారం డిమాండ్ చేశారు. కార్మికుల జీవితాల్లో చీకట్లు నింపే యాజమాన్య తీరుకు నిరసనగా అందరూ ధర్నాలో పాల్గొనాలన్నారు.