RR: అగ్ని ప్రమాదాల నివారణలో భాగంగా నగర వ్యాప్తంగా అధికారులు 350 భవనాలను తనిఖీ చేయగా, అందులో 320 భవనాల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనలు గుర్తించారు. అయినప్పటికీ సంబంధిత అధికారుల నుంచి తగిన చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి నిర్లక్ష్యం వల్ల ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉంది. అధికారులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
పెద్దపల్లి జిల్లాలో 2025-26 ఫైనాన్సియల్ ఇయర్ సంబంధించి ఉపాధి హామీ పథకంలో పెండింగ్ పనులు ఉంటే ఈనెల 25 వరకు పూర్తి చేయాలని అడిషనల్ పీడీ ప్రవీణ్ అన్నారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శిలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి పనులు కల్పించాలని సూచించారు. సమావేశంలో ఎంపీడీవో, ఏపీవో ఉన్నారు.
BDK: నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై శాఖ పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో కలెక్టర్ అంకిత్కు సోమవారం గిరిజన విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బాలాజీ నాయక్ ఫిర్యాదు చేశారు. చండ్రుగొండ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో విద్యార్థులు భద్రతను గాలికి వదిలేసారని అన్నారు. పాఠశాల ప్రాంగణంలోకి గుర్తుతెలియని వ్యక్తులు వస్తున్నారని అన్నారు.’
WGL: నర్సంపేట పట్టణంలో ప్రైవేటు వైద్యుడు, రేడియాలజిస్టు సతీశ్పై దాడి చేసిన మాజీ సర్పంచ్ సాగర్పై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై రవికుమార్ వివరాల ప్రకారం.. సాగర్ స్కానింగ్ సెంటర్కు వచ్చినప్పుడే సతీశ్ అందుబాటులో లేని సమయంలో సిబ్బందితో దుర్భాషలాడి, వైద్యుడిని కొట్టడమే కాక అసభ్యకర పదాలతో దూషించాడు. సతీశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
WNP: పానగల్ PACS పరిధిలో 600 యూరియా బస్తాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని కార్యదర్శి భాస్కర్ గౌడ్ తెలిపారు. రైతులు ఈరోజు ఉదయం 8:30 గంటల నుంచి బుకింగ్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. యాప్లో బుక్ చేసుకున్న వారు నేరుగా సొసైటీ గోదాం వద్ద యూరియా పొందవచ్చని, రైతులు ఈ అవకాశాన్ని వాడుకోవాలని కోరారు.
ASF: కాగజ్నగర్ మండలంలోని జోంబుగ గ్రామ వంతెనను జిల్లా కలెక్టర్ కే. హరిత సందర్శించారు. వంతెన నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆమె, పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మండలంలోని ఇతర అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు.
ADB: సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే చర్యలు తప్పవని బోథ్ CI గురుస్వామి తెలియజేశారు. పార్టీలు, గ్రూపులు, రాజకీయ వర్గాల మధ్య రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇతరులను కించపరిచేలా, గొడవలకు దారి తీసేలా వ్యక్తుల సంభాషణలు ఉండరాదన్నారు. సామాజిక మాధ్యమాల అడ్మిన్పై సైతం కేసు నమోదు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
హన్మకొండలో ఎండు గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులకు కోర్టు కఠిన శిక్ష విధించింది. ఒక్కొక్కరికి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ మొదటి అదనపు న్యాయమూర్తి బి.అపర్ణాదేవి తీర్పు వెల్లడించారు. 2023 జూలై 28న సుబేదారి పోలీసులు వడ్డెపల్లి క్రాస్ రోడ్డు వద్ద నిందితులను పట్టుకుని గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
జగిత్యాల జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఈనెల 25న ప్రైవేట్ రంగ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి బీ. సత్యమ్మ తెలిపారు. వరుణ్ మోటార్స్, గూగుల్ పే సంస్థల్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్, టెక్నీషియన్, కస్టమర్ కేర్, తదితర పోస్టులకు మొత్తం 80 ఖాళీలు ఉన్నాయన్నారు . ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, బీటెక్ వారు అర్హులు అన్నారు
KNR: తిమ్మాపూర్ మండలం రేణికుంట పొలిమేర నుంచి గొల్లపల్లి స్మశాన వాటిక వరకు వెళ్లే నక్ష దారి కబ్జాకు గురైందని గొల్లపల్లి సర్పంచ్ స్వరూప ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన సర్పంచ్, క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణమే హద్దులు ఏర్పాటు చేయాలని కోరారు. దారి లేక రైతులు, గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
WGL: నర్సంపేటలోని స్కానింగ్ సెంటర్లో కడుపునొప్పితో వచ్చిన మైనర్ బాలికకు గర్భం దాల్చిందని తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ఘటన సోమవారం సాయంత్రం కలకలం రేపింది. దీంతో రేడియాలజిస్ట్ నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరణ కోరగా పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారని ఆరోపించారు. బాధ్యులపై DMHO స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
KMR: పిట్లం గడి హనుమాన్ ఆలయంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి 11వ వార్షికోత్సవాన్ని నేడు ఉదయం 8 గంటలకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, హారతులు జరగనున్నాయి. అనంతరం భక్తులకు మహా అన్నప్రసాద వితరణ ఉంటుంది. ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు కోరారు.
NGKL: నాగర్ కర్నూల్ నియోజకవర్గ యాదవ జేఏసీ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర ఛైర్మన్ దాసరి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికలో గౌరవ అధ్యక్షుడిగా సుద్దుల సుధాకర్ యాదవ్, అధ్యక్షుడిగా బత్తుల బచ్చన్న, కోశాధికారిగా మధు యాదవ్ నియామకమయ్యారు. సామాజిక ఐక్యత కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు ప్రకటించారు.
KMM: రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన రైతులందరికీ ఏకకాలంలో ‘రైతు భరోసా’ నిధులను విడుదల చేసినందుకు రైతుల పక్షాన సీఎం అని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. రాష్ట్రంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని కొనియాడారు. సోమవారం అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో సీఎం రేవంత్ రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.
NZB: మోస్రా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నేడు ఉదయం 9 గంటల నుంచి పలు విభాగాలకు సంబంధించిన వైద్య నిపుణులు అందుబాటులో ఉండనున్నట్లు సర్పంచ్ గుత్పే భూపాల్ రెడ్డి తెలిపారు. స్త్రీల ప్రసూతి వైద్యులు, అప్తమాలజి, ఆర్థోపెడిక్, డెంటల్, జనరల్ డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్ అందరూ అందుబాటులో ఉంటారన్నారు. గ్రామ ప్రజలందరూ సేవలను వినియోగించుకోవాలన్నారు.