MHBD: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని మండల ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. మరిపెడ పట్టణ కేంద్రంలో అంగడి బజార్లో నేడు ఆశా వర్కర్లు భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. తక్కువ వేతనంతో తమ కుటుంబాలను పోషించడంలో కష్టతరమైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్య కోసం క్షేత్రస్థాయిలో నిత్యం వెట్టిచాకిరి చేస్తున్నాము.
JN: చిల్పూరు మండల BRS పార్టీ కన్వీనర్గా రంగు హరీష్ గౌడ్ ను మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య నియమించారు. అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, BRS పార్టీ బలోపేతమే ప్రధాన పనిచేస్తూ కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని హరీష్ గౌడ్కు రాజయ్య సూచించారు.
VKB: రైతు సమస్యల పరిష్కారానికి గురువారం అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో ఏఐకేఎంఎస్ నాయకుడు మహేందర్ను పోలీసులు తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందంటూ కిసాన్ సంగ్ అసెంబ్లీ ముట్టడికి నిర్ణయించింది. ఈ మేరకు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.
SRD: సంగారెడ్డి మండలం కల్పగూరు, అంగడిపేట, మల్కాపూర్ గ్రామాల్లో ఈ నెల 31వ తేదీ వరకు ఎన్ఎస్ఎస్ శీతాకాల ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ నిర్మల తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. వారం రోజుల పాటు వాలంటీర్లు గ్రామాల్లో పరిశుభ్రత, సామాజిక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారని చెప్పారు.
BHPL: జిల్లాలోని మంజూరు నగర్లో నూతన SBI బ్రాంచ్ను ఇవాళ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధిలో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవల విస్తరణ అత్యంత అవసరమని తెలిపారు. డిజిటల్ లావాదేవీలు, ఏటీఎం సేవలు వంటి అన్ని రకాల సేవలు ఈ బ్రాంచ్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.
MDK: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మార్కెట్ యార్డ్లోని మండల స్థాయి నిల్వ (MLS) కేంద్రాన్ని అధికారులతో కలిసి తనిఖీ చేశారు. గిడ్డంగిలోని నిత్యావసరాల నిల్వలు, నాణ్యత, సరఫరా రికార్డులను ఆమె సమీక్షించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు రేషన్ సక్రమంగా అందేలా చూడాలని, స్టాక్ పంపిణీలో పారదర్శకత పాటించాలని అధికారులను ఆదేశించారు.
MBNR: మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని ఒకటవ డివిజన్లో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని మహబూబ్నగర్ మేయర్ గుమ్మాల మమతా శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. గురువారం ఉదయం మున్సిపల్ కమిషనర్ రామానుజులు రెడ్డితో కలిసి డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎటువంటి పెట్రోల్, డీజిల్ కొరత లేదని ఇవాళ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న వదంతుల కారణంగా ప్రజలు పెద్ద సంఖ్యలో బంకుల వద్ద చేరి ఫుల్ ట్యాంక్ నింపించుకోవడం వల్ల రద్దీ ఏర్పడి సరఫరా వ్యవస్థకు అంతరాయం కలుగుతోందని, వదంతులు వ్యాప్తి చేస్తే చర్యలు తీసుకుంటాం.
NRPT: మద్దూరు మున్సిపాలిటీ పరిధిలోని భీంపురం 11వ వార్డులో తాగునీటి సమస్య పరిష్కారం కోసం బోర్ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని కౌన్సిలర్ సంజీవ్ ప్రారంభించి, పనులను పరిశీలించారు. స్థానికులు ఎదుర్కొంటున్న నీటి సమస్యలను త్వరలోనే పూర్తిగా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఏవైనా సమస్యలు ఉన్నా వెంటనే స్పందించి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.
MHBD: మొక్కజొన్న రైతులు మద్దతు ధర లేక భారీ నష్టాలు చవిచూస్తున్నారని కొత్తగూడ మండల బీఆర్ఎస్ అధికార ప్రతినిధి బానోత్ నెహ్రూ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఒక్క క్వింటాల్కు 1600 నుంచి 1800 రూపాయలకు మాత్రమే విక్రయించాల్సి వస్తోందని తెలిపారు. వెంటనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు.
ADB: ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ ప్రధాన కార్యదర్శి జాదవ్ సోమేశ్ ఇవాళ హైదరాబాదులోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో అరెస్టయ్యారు. ఈ సందర్బంగా ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమానికి పిలుపు ఇవ్వడంతో అక్కడి పోలీసులు ఆయన్ను ముందస్తు అరెస్ట్ చేశారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసినా నిరుద్యోగుల తరఫునే పోరాడుతామని ఆయన పేర్కొన్నారు.
MNCL: మందమర్రి మున్సిపాలిటీ పరిధి నార్లపూర్ జాతీయ రహదారిపై ఇవాళ తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. మంచిర్యాల వైపు వెల్లుల్లి లోడ్తో వెళ్తున్న లారీ నియంత్రణ కోల్పోయి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రహదారిపై వెల్లుల్లి బస్తాలు చెల్లాచెదురుగా పడటంతో రాకపోకలకు కొంత అంతరాయం కలిగింది.
GDWL: జిల్లాలో 2025-26 యాసంగి ధాన్యం సేకరణ పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా 87 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతులకు ఇబ్బంది కలగకుండా గన్నీ బ్యాగులు, ఇతర సౌకర్యాలు సిద్ధం చేయాలని, నిబంధనల ప్రకారం కొనుగోళ్లు జరపాలని సమీక్షా సమావేశంలో కలెక్టర్ స్పష్టం చేశారు.
KNR: సైదాపూర్ మండలం ఘణపూర్ ఎస్సీ కాలనీలో ఈ నెల 30న పౌరహక్కుల దినోత్సవం నిర్వహించనున్నట్లు ఎంఆర్వో శ్రీనివాస్ తెలిపారు. అస్పృశ్యత, అంటరానితనం, దళితుల కుల వివక్ష నిర్మూలన, ప్రజల మధ్య సమానత్వం, పౌరుల ప్రాథమిక హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించే దిశగా ఈ సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. పోరాకుల దినోత్సవంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
కామారెడ్డి: సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామ శివారులో నాటు బాంబు పేలిన ఘటన కలకలం రేపింది. మేతకు వెళ్లిన గేదె ఆహారంతో కలిపి ఉంచిన నాటు బాంబును కొరకడంతో అది ఒక్కసారిగా పేలి దవడ భాగం తీవ్రంగా దెబ్బతింది. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలంలో మరికొన్ని బాంబులను స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన గేదెకు పశువైద్యులు చికిత్స అందిస్తున్నారు.