MHBD: మొక్కజొన్న రైతులు మద్దతు ధర లేక భారీ నష్టాలు చవిచూస్తున్నారని కొత్తగూడ మండల బీఆర్ఎస్ అధికార ప్రతినిధి బానోత్ నెహ్రూ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఒక్క క్వింటాల్కు 1600 నుంచి 1800 రూపాయలకు మాత్రమే విక్రయించాల్సి వస్తోందని తెలిపారు. వెంటనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు.