MLG: ఏటూరునగరం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇవాళ భగత్ సింగ్ వర్ధంతిని జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా వారు చేసిన పోరాటం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని, వారి త్యాగాలు నేటి యువతకు మార్గదర్శకమని పేర్కొన్నారు.
KDP: పెండ్లిమర్రి(M) రంపతాడులో ఏప్రిల్ 3న జరగనున్న అంకాలమ్మ తల్లి తిరుణాల సందర్భంగా ఓల్డ్ కేటగిరి ఎద్దులతో బండలాగుడు పోటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఇందులో మొదటి బహుమతి రూ.50,000 ఇస్తున్నట్టు తెలిపారు. ఇలా ఎనిమిది బహుమతుల వరకు ఉంటాయన్నారు. పోటీల్లో పాల్గొనదలచిన ఎద్దుల యజమానులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు.
VKB: ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి పరిష్కరించడమే తమ లక్ష్యమని వికారాబాద్ మున్సిపల్ ఛైర్ పర్సన్ గడ్డం అనన్య అన్నారు. సోమవారం పట్టణంలోని 13వ వార్డు ఆలంపల్లిలో అధికారులతో కలిసి ఆమె పర్యటించారు. కాలనీలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన నిధులు మంజూరు చేయించి, అన్ని వార్డులను అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలుపుతామని హామీ ఇచ్చారు.
NTR: తిరువూరు లక్ష్మీపురం పాక్స్ పరిధిలోని రైతులకు సొసైటీ అధ్యక్షురాలు ప్రమీల చేతుల మీదుగా రూ. కోటి విలువైన ‘రైతు నేస్తం’ చెక్కులను అందజేశారు. గేదెలు, గొర్రెలు కొనుగోలు నిమిత్తం ఈ దీర్ఘకాలిక రుణాలు మంజూరు చేశారు. ఇప్పటి వరకు సొసైటీ ద్వారా రూ. 8.25 కోట్ల దీర్ఘకాలిక రుణాలు, రూ. 1.22 కోట్ల పంట రుణాలు రైతులకు అందించినట్లు ఆమె తెలిపారు. రైతుల ఆర్థికాభివృద్ధే లక్ష్యమని పేర్కొన్నారు.
MBNR: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి జడ్చర్లలో విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ ప్రజలను నిరాశపరిచిందని విమర్శించారు. ఆరు గ్యారంటీలు, ఇతర హామీల అమలుకు ఎదురుచూసిన రైతులు, మహిళలకు బడ్జెట్లో “గుండు సున్నా” మాత్రమే మిగిలిందని ఆయన ఎద్దేవా చేశారు. పండుగకాలంలో ప్రజలకు మేలు అందుతుందని ఆశించినవారిని ప్రభుత్వం వంచిందని తీవ్రంగా మండిపడ్డారు.
MDK: జిల్లాలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 11,236 మందికి గాను 11,216 మంది (99.82%) హాజరైనట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పరీక్షా కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యార్థులకు కల్పించిన మౌలిక సదుపాయాలను, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
NZB: దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలను భారతీయులందరూ నిత్యం స్మరించుకోవాలని సీపీ పి. సాయి చైతన్య పిలుపునిచ్చారు. కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ, మేరా యువ భారత్ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన ‘సమర్పణ దివస్’ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ప్రాణత్యాగాలను కొనియాడారు.
MBNR: మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని వీరన్నపేట డంపింగ్ యార్డ్ను అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ సోమవారం సందర్శించారు. ఎండల తీవ్రత దృష్ట్యా పొడి చెత్తపై ప్రతి రెండు రోజులకోసారి నీళ్లు చల్లాలని, తద్వారా అగ్నిప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా యార్డ్ నిర్వహణపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు.
SRCL: వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో ఉన్న తిప్పాపూర్ గోశాలలోని కోడెలు, గోవులను సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆలయ ఈవో ఎల్. రమాదేవి అన్నారు. సంబంధిత అధికారులతో కలిసి గోశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని గోశాలలో గోవులకు కల్పిస్తున్న సౌకర్యాలను సమీక్షించారు.
NGKL: అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో సోమవారం వేరుశనగ, మినుములు, మొక్కజొన్న ధరలు ఈ విధంగా ఉన్నాయి వేరుశనగ ధర గరిష్ఠంగా క్వింటాలు ధర రూ.8,697 పలికింది. కనిష్ఠ ధర రూ.5,001 నమోదైంది. అలాగే మినుములు క్వింటాలు ధర రూ.8,406, మొక్కజొన్న రూ.1,702 ధర లభించింది. మార్కెట్కు మొత్తం 1441 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చినట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు.
KMR: జిల్లా పిట్లం మండలం చిల్లర్గి గ్రామంలో ఉపాధి హామీ పథకం కూలీలు ఫేస్ రీడింగ్ విధానంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్నెట్, మొబైల్, కెమెరా సమస్యలు, సరైన వెలుతురు లేకపోవడంతో ముఖ గుర్తింపు నమోదు విఫలమవుతోంది. దీని వల్ల హాజరు నమోదు కాక, ఆదాయం కోల్పోతున్నామని, వేతనాలు సకాలంలో పడడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
TG: రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ ఇంట్లో పెళ్లి వేడుకకు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. కాగా, ఇటీవల తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ తరపున అభిషేక్ మను సింఘ్వీని నామినేట్ చేసిన విషయం తెలిసిందే.
మీరు ఒత్తిడిలో ఉన్నారో? లేదో? కొన్ని లక్షణాలతో తెలుసుకోవచ్చని వైద్య నిపుణులు తెలిపారు. రాత్రంతా నిద్రపోయినా ఉదయం అలసటగా అనిపించడం, తరచుగా తలనొప్పి, పనులపై ఏకాగ్రత కుదరకపోవడం వంటి లక్షణాలతో తెలుసుకోవచ్చు. ఒత్తిడిని పూర్తిగా ఆపలేకపోయినా, అది పేరుకుపోకుండా జాగ్రత్త పడవచ్చు. పని మధ్యలో చిన్న విరామాలు, పడుకునే ముందు ఫోన్ పక్కన పెట్టడం వంటి మార్పులు గొప్ప ఫలితాలనిస్తాయి.
MNCL: దండేపల్లి మండలంలోని గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో 1245 మంది భక్తులు హనుమాన్ దీక్ష మాలాధారణ చేశారు. సోమవారం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు వేద పండితుల సమక్షంలో హనుమాన్ దీక్ష మాలధారణను స్వీకరించారు. కాగా, మంగళవారం ఉదయం 10 గంటలకు దేవాలయం మండపంలో హుండీల లెక్కింపు కార్యక్రమం ఉందని ఈవో శ్రీనివాస్ వెల్లడించారు.
TPT: తిరుపతి నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్లమెంట్ కార్యాలయం వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, ఎన్టీఆర్కు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, కార్యకర్తలు హాజరై వేడుకను నిర్వహించారు.