NZB: దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలను భారతీయులందరూ నిత్యం స్మరించుకోవాలని సీపీ పి. సాయి చైతన్య పిలుపునిచ్చారు. కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ, మేరా యువ భారత్ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన ‘సమర్పణ దివస్’ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ప్రాణత్యాగాలను కొనియాడారు.