KDP: పెండ్లిమర్రి(M) రంపతాడులో ఏప్రిల్ 3న జరగనున్న అంకాలమ్మ తల్లి తిరుణాల సందర్భంగా ఓల్డ్ కేటగిరి ఎద్దులతో బండలాగుడు పోటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఇందులో మొదటి బహుమతి రూ.50,000 ఇస్తున్నట్టు తెలిపారు. ఇలా ఎనిమిది బహుమతుల వరకు ఉంటాయన్నారు. పోటీల్లో పాల్గొనదలచిన ఎద్దుల యజమానులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు.