NDL: శ్రీ కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి బనగానపల్లె మండలం పలుకూరు గ్రామానికి చెందిన ఉప్పరి సుబ్బరాయుడు కుటుంబ సభ్యులు కేజీ వెండి నాగపడగ(రూ.3.50 లక్షలు)తో పాటు సుమారు రూ.70 వేల విలువైన నిత్యావసర సరుకులు విరాళంగా ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, దాతలకు ఆలయ మర్యాదలతో తీర్థప్రసాదాలు అందజేశారు.
PDPL: రామగుండంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల సహాయార్థం ఆదివారం ఎల్బీనగర్లో ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. యువకులు రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు. ఆలయ ఫౌండేషన్ నిర్వాహకులు మాట్లాడుతూ.. తలసేమియాతో చిన్నారులకు రక్తం దొరకక ఇబ్బంది గురికావద్దని ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
MBNR: పాలమూరు యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ విభాగానికి చెందిన విద్యార్థి బడేసాబ్ రాయచూరులో నిర్వహించిన NIC 5K మారథాన్లో బాలుర విభాగంలో మొదటి స్థానం సాధించాడు. ఈ సందర్భంగా వీసీ ప్రో. జీఎన్ శ్రీనివాస్, రిజిస్టార్ ప్రో పి.రమేష్ బాబులు విద్యార్థి ఉన్నత స్థానాలను చేరాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపల్ డా మధుసూదన్ రెడ్డి,పీడీ డా వై శ్రీనివాసులు అభినందించారు.
TG: రవాణా శాఖపై తప్పుడు ప్రచారాలు చేస్తే లీగల్ చర్యలు తప్పవని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. ‘RTCలో జరిగే నియామకాలకు RTCకి సంబంధం ఉండదు. ఈ నియామకాలు పోలీస్ రిక్రూట్మెంట్సెల్ పరిధిలో జరుగుతాయి. డ్రైవర్కు 6అడుగులు అనేది తప్పుడు ప్రచారం. RTC టికెట్ యాప్లో సమస్యలు లేవు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు మానుకోకపోతే చర్యలు తప్పవు’ అని అన్నారు.
JGL: పెగడపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం సభ్యుల విజ్ఞాన యాత్ర కొనసాగుతోంది. పాలకవర్గ సభ్యులు ఛైర్మన్ బుర్ర రాములు గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం జోగులాంబ గద్వాల వ్యవసాయ మార్కెట్ కమిటీతో పాటు కర్ణాటకలోని రాయచూర్ మార్కెట్ కమిటీని సందర్శించారు. ఆయా మార్కెట్లలో రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలు, కొనుగోలు చేస్తున్న పంటలను సభ్యులు పరిశీలించారు.
ASR: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారికి సహకరించినా, ఆశ్రయం ఇచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని కొయ్యూరు సీఐ శ్రీనివాసరావు హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం మంప ఎస్సై శ్రీనివాస్, ఏపీఎస్పీ సిబ్బందితో గరిమండ గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి తనిఖీలు చేపట్టారు. అనుమానిత వ్యక్తులు గ్రామాల్లోకి ప్రవేశిస్తే సమాచారం అందించాలని ప్రజలను కోరారు.
NLR: అల్లూరు మండల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. అల్లూరు మండలంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో ONGC కంపెనీ సీఎస్ఆర్ నిధులు 90 లక్షలతో ఏర్పాటు చేయనున్న సెంట్రల్ లైటింగ్కు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ రవిచంద్ర పాల్గొన్నారు.
కృష్ణా: మచిలీపట్నం-పెడన జాతీయ రహదారి 216పై ట్రాఫిక్ సీఐ నున్న రాజు హెల్మెట్ ధరించడంపై ద్విచక్ర వాహనదారులకు ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ హెల్మెట్ ధరించని వాహనదారులకు కేవలం ఫైన్ వెయ్యడమే కాకుండా, వారితో అక్కడికక్కడే హెల్మెట్లు కొనుగోలు చేయించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా జరిపించాలని సూచించారు.
ELR: పెదపాడు మండలం ఏపూరు గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా రూ.30 లక్షల విలువైన నిలువ ఉంచిన అక్రమ బాణాసంచాను పోలీస్, ఫైర్, రెవిన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బాణాసంచా నిల్వలో నిర్లక్ష్యం వహిస్తే అది భారీ ప్రాణ, ఆస్తి నష్టానికి దారితీస్తుందని అధికారులు తెలిపారు. నిల్వ కేంద్రం నివాస ప్రాంతాలకు దూరంగా, కేవలం కాంక్రీట్ భవనాల్లో మాత్రమే ఉండాలన్నారు.
NTR : వీరులపాడు మండలం అల్లూరు విద్యుత్ సబ్స్టేషన్లో ఏఈగా వి. సురేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ముత్యాలంపాడు సబ్స్టేషన్ నుంచి బదిలీపై అల్లూరుకు వచ్చినట్లు తెలిపారు. ఇంతవరకు ఏఈగా విధులు నిర్వహించిన కృష్ణారెడ్డి ఇకపై సబ్ ఇంజనీర్గా సేవలందించనున్నారు. అధికారులు, సిబ్బంది నూతన ఏఈకు అభినందనలు తెలిపారు.
KRNL: రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్లకు కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పిఎస్.రాధాకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం చలో విజయవాడకు వెళ్తున్న అంగన్వాడీలను అడ్డుకోవడం, అరెస్ట్లు చేయడం సరికాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుత నిరసనలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
NDL: బండి ఆత్మకూరు మండల పరిధిలోని కేసీ కెనాల్లో ప్రమాదవశాత్తు యువకుడు పడిపోయి గల్లంతయ్యాడని ఎస్సై జగన్మోహన్ తెలిపారు. ఆదివారం ఉదయం ఒంగోలు ప్రాంతానికి చెందిన హేమంత్ అనే వ్యక్తి (17) గల్లంతైనట్లు తెలిపారు. ఎస్సై జగన్మోహన్, పోలీస్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, డ్రోన్ టీం సాయంతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ELR: ఉంగుటూరు మండలం నారాయణపురం ఉషోదయ హై స్కూల్లో ఉంగుటూరు మండల మానవత సమావేశం ఆదివారం జరిగింది. సమావేశానికి అధ్యక్షులు KVV.సత్యనారాయణ అధ్యక్షత వహించారు. వృద్ధుల, అనాధ బాలల ఆశ్రమకు మానవత సంస్థ రూ.50 వేల విలువైన 70 కుర్చీలను ఆనంద నిలయం ఛైర్మన్ గుణ్ణం బులెబ్బాయ్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో రీజియన్ ఛైర్మన్ పుప్పాల గోపి, సర్వేశ్వరరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
NDL: కర్నూలు నగరంలో జిల్లా పరిషత్ సమావేశంలో ఆదివారం జిల్లా కలెక్టర్ రాజకుమారి పలు సమస్యలపై స్పందించారు. నూనెపల్లె-కోవెలకుంట్ల రహదారి విస్తరణలో బోర్లు దెబ్బతిన్న అంశంపై చర్యలు తీసుకుంటామని, ఎర్రగుంట్ల పాఠశాలలో వసతుల కొరతపై పరిశీలన జరిపించి వెంటనే సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. డోన్లో రేషన్ కార్డు సమస్యలు పరిష్కరించాలని అధికారుతకు ఆదేశించారు.
HNK: శాయంపేట మండలంలోని పెద్దకోడెపాక బీరన్న గుడి ఆలయ కమిటీ అధ్యక్షులుగా ముజిగిరి వేణు, కురుమ కుల పెద్ద మనిషిగా అమ్మ రాజు ఎన్నికయ్యారు. కురుమ కులస్తులు ఐక్యంగా ఉంటూ కుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధనకై కృషి చేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మంద దీన ప్రభాకర్, ఉపసర్పంచ్ ఫైండ్ల సునిత చంద్రమౌళి, అమ్మ అశోక్, రవీందర్, శ్రీనివాస్ ఉన్నారు.