NDL: బండి ఆత్మకూరు మండల పరిధిలోని కేసీ కెనాల్లో ప్రమాదవశాత్తు యువకుడు పడిపోయి గల్లంతయ్యాడని ఎస్సై జగన్మోహన్ తెలిపారు. ఆదివారం ఉదయం ఒంగోలు ప్రాంతానికి చెందిన హేమంత్ అనే వ్యక్తి (17) గల్లంతైనట్లు తెలిపారు. ఎస్సై జగన్మోహన్, పోలీస్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, డ్రోన్ టీం సాయంతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.