JGL: పెగడపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం సభ్యుల విజ్ఞాన యాత్ర కొనసాగుతోంది. పాలకవర్గ సభ్యులు ఛైర్మన్ బుర్ర రాములు గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం జోగులాంబ గద్వాల వ్యవసాయ మార్కెట్ కమిటీతో పాటు కర్ణాటకలోని రాయచూర్ మార్కెట్ కమిటీని సందర్శించారు. ఆయా మార్కెట్లలో రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలు, కొనుగోలు చేస్తున్న పంటలను సభ్యులు పరిశీలించారు.