ASR: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారికి సహకరించినా, ఆశ్రయం ఇచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని కొయ్యూరు సీఐ శ్రీనివాసరావు హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం మంప ఎస్సై శ్రీనివాస్, ఏపీఎస్పీ సిబ్బందితో గరిమండ గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి తనిఖీలు చేపట్టారు. అనుమానిత వ్యక్తులు గ్రామాల్లోకి ప్రవేశిస్తే సమాచారం అందించాలని ప్రజలను కోరారు.