NDL: కర్నూలు నగరంలో జిల్లా పరిషత్ సమావేశంలో ఆదివారం జిల్లా కలెక్టర్ రాజకుమారి పలు సమస్యలపై స్పందించారు. నూనెపల్లె-కోవెలకుంట్ల రహదారి విస్తరణలో బోర్లు దెబ్బతిన్న అంశంపై చర్యలు తీసుకుంటామని, ఎర్రగుంట్ల పాఠశాలలో వసతుల కొరతపై పరిశీలన జరిపించి వెంటనే సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. డోన్లో రేషన్ కార్డు సమస్యలు పరిష్కరించాలని అధికారుతకు ఆదేశించారు.