JN: 10వ తరగతి వార్షిక పరీక్షల్లో ఇప్పటికే 4 సబ్జెక్టులు పూర్తయ్యాయి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమయానికి ఫలితాలు విడుదల చేయాలనే లక్ష్యంతో విద్యాశాఖ అధికారులు ఏప్రిల్ 1 నుంచి 23 వరకు మూడు విడతలుగా సమాధాన పత్రాల మూల్యాంకనం చేపడుతున్నారు. రోజూ ఉ 9 నుంచి 12, మళ్లీ, 2 మ నుంచి సా 5 నిర్ణయిస్తున్నట్లు తెలిపారు.
TG: ఇందిరమ్మ ఇళ్లలో ఇవాళ్టి నుంచి లబ్ధిదారులు గృహప్రవేశం చేయనున్నారు. ఏప్రిల్ 1, 20, 21, 30 తేదీల్లో గృహప్రవేశాలు జరగనున్నాయి. మేలో 4, 8, 13, 14, 18, 25, 27, 28.. జూన్ మొదటి వారంలో లబ్ధిదారుల గృహ ప్రవేశాలకు ముహూర్తాలు ఖరారు చేసింది. ఏప్రిల్ చివరినాటికి కొత్త ఇళ్లలోకి 33 వేల మంది లబ్ధిదారులు మారనున్నారు.
KDP: జమ్మలమడుగు నారాపుర వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 30వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఏప్రిల్ 30న సాయంత్రం 6 గంటలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
PDPL : ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ సహజమని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహరి అన్నారు పెద్దపల్లి జిల్లా పంచాయతీ అధికారి వీర బుచయ్య పదవీ విరమణ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కోయ శ్రీ హర్ష ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బుచయ్య 30-35 ఏళ్ల ప్రజాసేవను ప్రశంసించారు. పంచాయతీ ఎన్నికలు సజావుగా జరుగడంలో ఆయన కీలకపాత్ర పోషించారన్నారు.
RR: రిటైల్ చికెన్ సెంటర్లకు ఇచ్చే మార్జిన్ పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో షాద్నగర్ నియోజకవర్గంలోని వందలాది చికెన్ దుకాణాలను బంద్ చేశారు. అయితే పౌల్ట్రీ కంపెనీలు తమకు ఇచ్చే మార్జిన్ తగ్గించడంతో వ్యాపారస్తులు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
NZB: సిరికొండ మండలం పందిమడుగు రోడ్డు కోతకు గురై ప్రమాదకరంగా మారింది. ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే ప్రయాణికులు జంకుతున్నారు. గత నెలలలో గుంతలో పడి ముగ్గురు ప్రయాణికులు గాయాలపాలయ్యారు. మరమ్మతులు చేయాలని (ఆర్అండ్ బి) అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే రోడ్డును మరమ్మత్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
MBNR: మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ మీదుగా నడిచే పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే డీపీఆర్ఓ శ్రీధర్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. 17435 కాచిగూడ-కర్నూల్ సిటీ, 67787 కాచిగూడ-రాయచూరు, 67788 రైచూర్-కాచిగూడ, 17693 కాచిగూడ-రైచూర్, 17694 రాయచూర్-కాచిగూడ, 67784 గద్వాల-రాయచూర్, 67783 రాయచూరు-గద్వాల రైళ్లు ఈనెల 7వ తేదీ వరకు రద్దయ్యాయన్నారు.
కృష్ణా: పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అవనిగడ్డ గ్రామ సచివాలయం -4 ఎస్టీ కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందచేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ మొత్తాన్ని పెంచి అందిస్తోందన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈనెల 7నుంచి 28వ తేదీ వరకు దివ్యాంగుల కోసం సదరం క్యాంపులను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రిలో 16 కేటగిరీలలో స్లాట్ బుక్ చేసుకున్న వారికి సదరం క్యాంపులను నిర్వహిస్తామని తెలిపారు. ఏప్రిల్ 7,8,10, 15,17,21,24,28 తేదీలలో సదరం క్యాంపులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
NRML: జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో ప్రత్యేక గ్రామ సభలను అందరూ విజయవంతం చేయాలని స్థానిక ఎంపీడీవో ఉమర్ షరీఫ్ కోరారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం జన్నారం మండలంలోని 29 గ్రామపంచాయతీలలో ప్రత్యేక గ్రామసభలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
KNR: కరీంనగర్ నగరంలోని ఐటీ టవర్లో గల టాస్క్ ఆఫీసులో అడ్వాన్స్డ్ ఎక్సెల్, బేసిక్ ఐటీ నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రతినిధులు తెలిపారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి గల వారు ఈనెల 10వ తేదీలోపు ఐటీ టవర్ మొదటి అంతస్తులోని టాస్క్ కార్యాలయంలో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
VKB: తాండూరు పట్టణంలోని వీరశైవ సమాజం నూతన కార్యవర్గ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 8 నుంచి 12 వరకు నామినేషన్ల స్వీకరణ, 14న ఉపసంహరణ ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఏప్రిల్ 26న ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
MHBD: నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని తొర్రూరులో కార్మిక సంఘాల నేతలు నిరసన చేపట్టారు. నేతలు విశ్వేశ్వరరావు, రవి మాట్లాడుతూ… కార్మిక వ్యతిరేక విధానాలను ప్రభుత్వాలు వెంటనే ఉపసంహరించుకోవాలని, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతూ కార్మికులను ఆదుకోవాలని అన్నారు.
KMM: రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ఈరోజు నుంచి జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాల్లో ఈ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలో 748 దుకాణాల పరిధిలో 4,69,865 కార్డుదారులు ఉండగా, 13,28,400 మంది లబ్ధి పొందుతున్నారు. లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ నెలకు ఆరు కేజీల చొప్పున పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
కోనసీమ: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన ప్రతీ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యమని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తెలిపారు. బుధవారం మండపేట పట్టణంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మండపేట లబ్ధిదారులకు కొత్తగా మంజూరైన స్పౌస్ పింఛన్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు.