KNR: కరీంనగర్ నగరంలోని ఐటీ టవర్లో గల టాస్క్ ఆఫీసులో అడ్వాన్స్డ్ ఎక్సెల్, బేసిక్ ఐటీ నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రతినిధులు తెలిపారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి గల వారు ఈనెల 10వ తేదీలోపు ఐటీ టవర్ మొదటి అంతస్తులోని టాస్క్ కార్యాలయంలో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.