కృష్ణా: పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అవనిగడ్డ గ్రామ సచివాలయం -4 ఎస్టీ కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందచేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ మొత్తాన్ని పెంచి అందిస్తోందన్నారు.