VSP: పశ్చిమ నియోజకవర్గం ములగడ పరిధిలోని గ్రామాలను కలుపుకుంటూ ఏడు వార్డుల్లో ఇవాళ ‘స్పిరిట్ ఆఫ్ యూనిటీ’ క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ ఫర్ జీసస్ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణబాబు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. సమాజంలో శాంతి సోదర భావం పెంపొందించడంలో క్రైస్తవ సోదరుల పాత్ర అభినందనీయమని కొనియాడారు.
SRD: కంగ్టి మండలం చాప్టా (కే) గ్రామంలో విశ్వగురు మహాత్మ బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఖేడ్ మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డిని నేడు గ్రామస్తులు ఆహ్వానించారు. ఈనెల 19న జరుపతలపెట్టిన విగ్రహ ఆవిష్కరణ కరపత్రాన్ని ఆయనకు అందించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బసవేశ్వరుడు విశ్వవ్యాప్త ప్రజలకు మహాత్ముడని, ఆయన అడుగుజాడల్లో నడవాలన్నారు.
GNTR: ఫిరంగిపురం(మం) పొనుగుపాడు గ్రామం నుంచి కర్నూలు, గుంటూరు ప్రధాన రహదారికి కలిపే సుమారు 3 కి.మీ జిల్లా పరిషత్ రోడ్డును తక్షణమే నిర్మించాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పదేళ్లకుపైగా ఈ రహదారి మరమ్మతులు లేకుండా పూర్తిగా దెబ్బతిని ప్రస్తుతం గుంతలమయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
JN: కొడకండ్ల (M) నరసింగాపురం గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులను స్థానిక సర్పంచ్ గోపాలదాసు లలిత వెంకటయ్య, నేతలు ప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని, అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ASF: కౌటల మండలం బోదంపల్లి గ్రామంలో పల్లె ప్రకృతి వనంను ధ్వంసం చేసి ప్రజా ధనం దుర్వినియోగం చేస్తున్నారని పలువురు గ్రామస్థులు మండిపడ్డారు. శనివారం వారు మాట్లాడుతూ.. ఎటువంటి అనుమతి లేకుండా పల్లె ప్రకృతి వనంను ధ్వంసం చేసి అదే స్థలంలో IKP భవనం నిర్మించడం సరికాదన్నారు. IKP భవనం మరో చోట నిర్మించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు.
కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గాలంటే సరైన జీవనశైలి ముఖ్యం. రోజూ 7-8 గంటల గాఢ నిద్ర అవసరం. ఎక్కువగా నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. కీరదోస ముక్కలు లేదా చల్లని టీ బ్యాగులను కళ్లపై ఉంచితే రక్త ప్రసరణ మెరుగుపడి నలుపు తగ్గుతుంది. పోషకాహారం తీసుకుంటూ, ఫోన్ స్క్రీన్ సమయాన్ని తగ్గించాలి. బాదం నూనెతో మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
కడప డివిజన్లో జీఎస్టీ వసూళ్లు 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.851.44 కోట్లు రాగా.. 2025-26లో రూ.932.83 కోట్లు వచ్చాయని SGST కడప జాయింట్ కమిషనర్ సుమతి తెలిపారు. నెలకు సగటున రూ.70.95 కోట్లు జీఎస్టీలు వసూలయ్యాయని ఆమె చెప్పారు. రూ.82.38 కోట్ల పెరుగుదల నమోదైందన్నారు. 2025 మార్చిలో రూ.73.31 కోట్లు రాగా.. 2026 మార్చిలో రూ.84.39 కోట్లకు పెరిగాయని వెల్లడించారు.
VKB: బషీరాబాద్లో ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించిన బస్సు షెల్టర్ అధికారుల నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారింది. దీనిని వాడకపోవడంతో ప్రయాణికులు ఎండలో రోడ్డుపైనే బస్సుల కోసం వేచి చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దుకాణాల ముందు తలదాచుకుంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.
TG: ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక కాసేపట్లో జరగనుంది. ముందుగా సభ్యులు ప్రమాణస్వీకారం చేస్తారు. తర్వాత మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ను ఎన్నుకుంటారు. ఎన్నిక నేపథ్యంలో 850 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నలుగురు డీసీపీలకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.
AKP: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖలో నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ లాబొరేటరీ (NSTL)లో లార్జ్ కేవిటేషన్ టన్నెల్ (LCT) ప్రాజెక్టుకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ అత్యాధునిక సదుపాయం డీఆర్డివో ఆధ్వర్యంలో నిర్మాణం కానుంది. నౌకల హైడ్రోడైనమిక్ పరిశోధన, పరీక్షలను దేశీయంగా నిర్వహించేందుకు ఇది దోహదం చేస్తుంది.
KDP: జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఆదిశేషారెడ్డి వల్లూరు మండలం టి. జి పల్లె, తప్పెట్ల గ్రామ పంచాయతీలలో ఉపాధి హామీ కింద జరుగుతున్న ఫీడర్ ఛానల్ పనులను పరిశీలించారు. నూతనంగా వచ్చిన ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా ఫోటోలు పంపే పద్ధతిని తనిఖీ చేసి అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చారు. ఈ పరిశీలనలో ఏపీవో డి. వి సుధారాణి, తదితరులు పాల్గొన్నారు.
E.G: డప్పు కళాకారుడిపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేయి చేసుకోవడం హేయమైన చర్యలు అని మండల వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మల్లిపూడి సలీం విమర్శించారు. దళితుడి వయసుపై గౌరవం లేకుండా వ్యవహరించారని, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి పాలనలో దళితులపై దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుడికి న్యాయం చేసి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
నితేష్ తివారీ ‘రామాయణ’ ఓటీటీ డీల్ గురించి ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. రెండు భాగాల డిజిటల్ హక్కుల కోసం ఓ సంస్థ రూ.1000 కోట్లు ఆఫర్ చేయగా, నిర్మాత నమిత్ మల్హోత్రా దాన్ని తిరస్కరించారట. ‘ధురంధర్’ వ్యూహంతో మొదటి భాగం విడుదలయ్యాక, దాని సక్సెస్ను బట్టి రెండో పార్ట్ డీల్ కుదుర్చుకోవాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ మూవీ బిజినెస్ హాట్ టాపిక్గా మారింది.
NRPT: కోస్గి మున్సిపాలిటీలో వివిధ వార్డుల నుంచి మురుగు నీటిని సేకరించి తరలించడానికి నూతన డ్రైనేజీ నిర్మాణం నత్తనడకన కొనసాగుతుంది. సుమారు ఏడాదిగా సాగుతున్న ఈ పనులు పూర్తయ్యిన తర్వాత పట్టణంలోని చుట్టుపక్కల డ్రైనేజీ సమస్యలకు తుదిపరిష్కారం లభిస్తుంది. వాసులు నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని కోరుతున్నారు.
SRPT: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని సర్పంచ్ చింతకుంట్ల మనోజ్ అన్నారు. శనివారం తుంగతుర్తి మండలం రావులపల్లిలో బడిబాట కార్యక్రమంలో భాగంగా జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉంటారన్నారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫాం అందిస్తోందన్నారు.