E.G: డప్పు కళాకారుడిపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేయి చేసుకోవడం హేయమైన చర్యలు అని మండల వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మల్లిపూడి సలీం విమర్శించారు. దళితుడి వయసుపై గౌరవం లేకుండా వ్యవహరించారని, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి పాలనలో దళితులపై దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుడికి న్యాయం చేసి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.