KDP: జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఆదిశేషారెడ్డి వల్లూరు మండలం టి. జి పల్లె, తప్పెట్ల గ్రామ పంచాయతీలలో ఉపాధి హామీ కింద జరుగుతున్న ఫీడర్ ఛానల్ పనులను పరిశీలించారు. నూతనంగా వచ్చిన ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా ఫోటోలు పంపే పద్ధతిని తనిఖీ చేసి అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చారు. ఈ పరిశీలనలో ఏపీవో డి. వి సుధారాణి, తదితరులు పాల్గొన్నారు.