JN: రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు నిధులను ఒకే విడతలో రైతుల అకౌంట్లో జమ చేయాలని, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాపర్తి సోమయ్య డిమాండ్ చేశారు. రైతు సంఘం ఆధ్వర్యంలో ఇవాళ పాలకుర్తి తాహసీల్దార్ కార్యాలయంలోపై డిమాండ్లతో కూడిన వినతి పత్రమును తాహసీల్దార్ సరస్వతికి అందజేశారు.
రణవీర్ సింగ్ ‘ధురంధర్-2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. అయితే, ఈ చిత్ర విజయంపై రణవీర్ భార్య, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఇప్పటివరకు స్పందించకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో వారిద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. తాజాగా వీరిద్దరూ కలిసి ముంబైలోని ఒక ప్రముఖ రెస్టారెంట్ వద్ద సందడి చేయడంతో ఈ పుకార్లకు చెక్ పడింది.
AP: ఉత్తరాంధ్రలోని నక్కలపల్లిలో కొత్తచరిత్ర తిరగరాస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ‘విశాఖ ఉక్కు కంటే అతిపెద్ద పరిశ్రమను రాజయ్యపేటలో ఏర్పాటు కాబోతుంది. ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ పెట్టబడి గొప్ప మలుపు. ప్రపంచంలోనే నంబర్వన్ ఉక్కు పరిశ్రమగా ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ప్లాంట్ కాబోతుంది. కేంద్రం సహకారం ఉండటం వల్లే సాధ్యం అయ్యింది’ అని వెల్లడించారు.
E.G: తాళ్లపూడిలో సోమవారం నిర్వహించిన ‘రైతన్న సేవలో’ కార్యక్రమంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే స్థానిక రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నామన పరమేష్, సిద్దా దుర్గా ప్రసాద్, కేదారేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
TG: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంలో భారీ స్కాం జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. 75 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి నోటిఫికేషన్ ఇచ్చారని.. 4.9శాతం అధిక మొత్తానికి అంచనా ఇచ్చారన్నారు. ఇందులో వెయ్యి కోట్ల స్కాం జరిగిందని.. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంలో అవినీతిపై సిట్ వేయాలన్నారు.
పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఇవాళ నిర్వహించిన టెన్త్ క్లాస్ ఆంగ్లం పరీక్షకు 7478 మంది విద్యార్థులు హాజరయ్యారని DEO శారద ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 7,484 మంది విద్యార్థులకు గాను ఆరుగురు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. 99.9% విద్యార్థులు హాజరయ్యారన్నారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని, ప్రశాంతంగా జరిగిందని తెలిపారు.
PLD: అమరావతి మండలం ధరణికోటలో నిర్వహించిన ‘రైతన్నా – మీకోసం’ కార్యక్రమంలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ఎమ్మెల్యే అవగాహన కల్పించారు.
బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ పాల్గొన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల విన్నపాలను స్వీకరించారు. వాటిని చట్టపరంగా విచారించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
NLG: రవాణా శాఖలో ‘వాహన్’ పోర్టల్ సేవలు సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. రిజిస్ట్రేషన్, ఓనర్షిప్ మార్పు, పన్నుల చెల్లింపు వంటి సేవలు ఇకపై ఆన్లైన్లో సులభంగా పొందవచ్చు. కేంద్ర వ్యవస్థతో అనుసంధానం కావడంతో ఇతర రాష్ట్రాల వాహన బదిలీలు కూడా సులభతరం కానున్నాయి. దీనిపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
MLG: ఏటూరునాగారంలోని ITDA కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి – గిరివాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుదారులను కలెక్టర్ దివాకర టీఎస్ స్వయంగా స్వీకరించారు. దరఖాస్తులను పెండింగ్లో పెట్టకుండా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
కర్ణాటక బెలగావిలో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. CBI అధికారుల పేరుతో వీడియా కాల్ చేసి వృద్ధుడి నెల రోజులుగా వాట్సాప్ కాల్ ద్వారా ఒత్తిళ్లకు గురిచేశారు. ఈ క్రమంలో వృద్ధుడి దగ్గర నుంచి రూ.15.45 కోట్లను సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. అనంతరం మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాకినాడ జిల్లాలో 100% పంచాయతీ పన్నులు వసూలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం రూ. 98 కోట్లలో, వోఎన్జీసీకి చెందిన రూ. 17 కోట్ల వివాదం కోర్టులో ఉండగా, మిగిలిన రూ. 81 కోట్లలో ఇప్పటివరకు రూ.56. 58 కోట్లు(66.5%) వసూలైనట్లు ఇంఛార్జ్ DPO లక్ష్మణరావు సోమవారం తెలిపారు. మిగిలిన బకాయిల వసూలుపై ప్రత్యేక దృష్టి సాధిస్తామని చెప్పుకొచ్చారు.
WGL: ఖానాపురం (M) అశోక్ నగర్ భూమి వివాదంపై 75 ఏళ్ల వృద్ధుడు మహమ్మద్ నమ్మద్ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ డా. సత్య శారదకి వినతి పత్రం సమర్పించారు. గతంలో హక్కు పట్టాలు మంజూరు చేయాలని ఆదేశాలు ఉన్నప్పటికీ అమలు కాలేదని తెలిపారు. కోర్టు తీర్పులు, పలు ఆధారాలు సమర్పించినా సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన న్యాయం చేయాలని కోరారు.
BDK: అశ్వాపురం మండలం తహసీల్దార్కు ఆదివాసి సంఘం, తుడుం దెబ్బ ఆధ్వర్యంలో సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ వాసం రామకృష్ణ దొర మాట్లాడుతూ.. మండల పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా 1/70 చట్టానికి విరుద్ధంగా అసైన్డ్ భూములలో, ఇటుక బట్టీలు నిర్వహిస్తున్న గిరిజ నేతరులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పల్లు నాయకులు పాల్గొన్నారు.
SDPT: రైతు మహోత్సవ వేడుకలను విజయవంతం చేసినందుకు ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి రైతులకు ధన్యవాదాలు తెలిపారు. నర్మేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం చేతుల మీదుగా ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం అపూర్వంగా జరిగిందన్నారు.ఈ భారీ కార్యక్రమ నిర్వహణ కోసం అహోరాత్రులు శ్రమించిన అధికార యంత్రాంగాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.