NZB: బాల్కొండ సర్పంచ్ గాండ్ల రాజేశ్కు అరుదైన గౌరవం లభించింది. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా జాతీయ సర్పంచ్ సంవాద్ ఆన్లైన్ పోటీలను ఈనెల 18 నుంచి 20 వరకు దేశవ్యాప్తంగా సర్పంచ్లకు నిర్వహించారు. ఈ పోటీలో బాల్కొండ సర్పంచ్ రాజేశ్ జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచారు.
కోనసీమ: అమలాపురం పట్టణం భూపయ్య అగ్రహారంలో విద్యుత్ షాక్ కారణంగా ఓ ఆవు మృత్యువాత పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం కురిసిన అకాల వర్షానికి ఒక అపార్ట్మెంట్ ప్రహరీ వద్ద ఎర్త్ వైర్ ద్వారా విద్యుత్ ప్రవహించడంతో ప్రహరీని ఆనుకుని వెళ్లిన ఆవు షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదానికి కారణమని అంటున్నారు.
MLG: జిల్లా కేంద్రంలోని MLA క్యాంపు కార్యాలయంలో CMRF కింద మంజూరైన సుమారు 5 లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు సోమవారం రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కుంజా సూర్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. CMRF పథకం నిరుపేదలకు ఓ వరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో SC, ST అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యులు జన్ను రవి తదితరులు ఉన్నారు.
AP: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లోని తెలుగు వారితో MLC నాగబాబు వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో.. ఏ ఆపద వచ్చినా జనసేన, కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సౌదీ, యూఏఈ, ఖతార్ తదితర దేశాల్లోని భారతీయులు ధైర్యంగా ఉండాలని, పరిస్థితులు త్వరలోనే కుదుటపడతాయని ఆయన ఆకాంక్షించారు.
SRD: ఖేడ్ మండలం సంజీవనరావుపేట గ్రామానికి చెందిన సారా కార్తీక్ (15) అనే బాలుడికి ఇటీవల ప్రమాదంలో కాలు కోల్పోయాడు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆర్థిక సహాయం, దాతల అపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో PACS మాజీ చైర్మన్ ఊర్మిల రాంరెడ్డి ఆదివారం రూ. 1 లక్ష ఆర్థిక సహాయం బాధిత బాలుడికి అందించి అండగా నిలిచారు.
MDK: చిన్న శంకరంపేట మండలం మిర్జాపల్లిలో దారుణం చోటు చేసుకుంది. గ్రామ శివారులో గుర్తు తెలియని యువకుడు ఆదివారం రాత్రి హత్యకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. మిర్జాపల్లికి చెందిన ప్రజలు ఈ దారిన వెళ్లాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. హత్య చేసింది ఎవరూ అనే విషయాలు తెలియాల్సి ఉంది.
AKP: ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ సభకు కోటవురట్ల మండలం నుంచి వెళ్లే ప్రజలకు గొట్టివాడ వద్ద భోజనాలు తయారు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీడీవో చంద్రశేఖర్, ఉపాధి పథకం ఏపీడీ చిన్నారావు, ఏపీఓ నాగరాజు ఇవాళ ఉదయం పర్యవేక్షించారు. శుభ్రతతో పాటు నాణ్యతగా భోజనం ప్యాకెట్లను సిద్ధం చేయాలని సూచించారు.
VZM: రాజాం మండలం అంతకాపల్లి-మొగిలివలస నుంచి సారథి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై రైతులు మొక్కజొన్న పిక్కలను ఆరబెడుతున్నారు. దీంతో వాహనదారులు రాకపోకల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగిరి గుయ్యన్నవలస రహదారిలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.
JGL: వ్యవసాయ మార్కెట్ కార్యాలయాల్లో పనిచేస్తున్న తమకు కనీస వేతనం అమలు చేయాలని కోరుతూ సెక్యూరిటీ గార్డులు ఆదివారం రాష్ట్ర మంత్రి లక్ష్మణ్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి, ప్రభుత్వం నేరుగా జీతాలు చెల్లించాలని వారు కోరారు. కనీస వేతన చట్టం అమలుకు కృషి చేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ASF: రెబ్బెన మండలం గంగాపూర్ పరిసరాల్లో ఆదివారం రాత్రి పేకాట ఆడుతున్న ముఠాపై మెరుపు దాడి చేసి ఐదుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నట్లు SI వెంకటకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 2,540 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. పేకాట, బెట్టింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
KMM: వ్యవసాయ యాంత్రీకరణతోనే సాగు లాభసాటిగా మారుతుందని కాంగ్రెస్ రాష్ట్ర నేత మట్టా దయానంద్ అన్నారు. ఆదివారం పెనుబల్లిలో 50 శాతం సబ్సిడీపై రోటవేటర్లు, బేయిలర్లు, స్ప్రేయర్లను రైతులకు పంపిణీ చేశారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక రాయితీలు కల్పిస్తోందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ బాగం నీరజ పాల్గొన్నారు.
KRNL: వెల్దుర్తి మండలం బుక్కాపురం గ్రామంలో ఈనెల 28న జరిగే BR.అంబేద్కర్ విగ్రహావిష్కరణకు MRPS వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ రానున్నట్లు సమితి జిల్లా అధ్యక్షుడు రెడ్డిపోగు భాస్కర్ తెలిపారు. ఆదివారం జిల్లా ఇంచార్జ్ దమ్ము వెంకటేశ్వర్లు, స్థానిక MRPS, MSP ప్రతి నిధులతో కలిసి పట్టణంలో కరపత్రాలు విడుదల చేశారు. పర్యటన జయప్రదం చేయాలన్నారు.
MBNR: తిమ్మాజీపేట మండలం అవంచ గ్రామంలో నూతన ఆంజనేయస్వామి దేవాలయ నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సోమవారం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన స్వగ్రామంలో నూతన దేవాలయం నిర్మిస్తుండడం సంతోషించదగ్గ విషయం అని అన్నారు. అందుకు తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానన్నారు.
NLG: మహిళల వంటింటి కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి’ పథకం పట్టాలు తప్పుతోంది. రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్న హామీపై NLG జిల్లాలోని పేద, మధ్య తరగతి మహిళలు పెట్టుకున్న నమ్మకం సడలుతోంది. 12 నెలలకు పైగానే లబ్ధిదారుల ఖాతాల్లో సబ్సిడీ సొమ్ము జమకాకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
PDPL: సివిల్ సప్లై హమాలీ యూనియన్ పెద్దపల్లి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా కడారి సునీల్, ప్రధాన కార్యదర్శిగా ఎం.గట్టయ్య, ఉపాధ్యక్షునిగా ఎం.కుమార్, సహాయ కార్యదర్శిగా ఎం.తిరుపతి కోశాధికారిగా బి. పోచమల్లు, కార్యవర్గ సభ్యులుగా జి.సమ్మయ్య, మహేశ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గాన్ని సత్కరించారు.