JGL: వ్యవసాయ మార్కెట్ కార్యాలయాల్లో పనిచేస్తున్న తమకు కనీస వేతనం అమలు చేయాలని కోరుతూ సెక్యూరిటీ గార్డులు ఆదివారం రాష్ట్ర మంత్రి లక్ష్మణ్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి, ప్రభుత్వం నేరుగా జీతాలు చెల్లించాలని వారు కోరారు. కనీస వేతన చట్టం అమలుకు కృషి చేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.