తిరుమలలో ఈ నెల 30 నుంచి 3 రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయి. దీంతో ఈ రోజుల్లో కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం తదితర సేవలను TTD రద్దు చేసింది. 30న స్వామి తన దేవేరులతో మాడవీధుల్లో విహరించి, వసంత మండపానికి చేరుకుంటారు. 31న బంగారు రథంపై ఊరేగింపు, వసంతోత్సవం.. చివరిరోజున స్వామి, సీతారామలక్ష్మణాంజేయులతో పాటు రుక్మిణీ సమేత కృష్ణుడితో ఉత్సవంలో పాల్గొంటారు.
MHBD: కురవి మండల కేంద్రంలోని గుడి పరిసరాల్లో ఉన్న పలు లాడ్జీలను ఎస్సై గండ్రాతి సతీష్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి తనిఖీలు చేపట్టారు. తాళలు వేసిన గదులు, గదుల్లో ఉన్న వ్యక్తుల ఆధార్ కార్డులు, రికార్డులో ఉన్న వాళ్ళ పేర్లను పరిశీలించారు. లాడ్జిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆదిలాబాద్లోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ వెజిటేబుల్ మార్కెట్ వద్ద బహిరంగంగా మద్యం తాగిన ఇద్దరిని పట్టుకున్నట్లు CI సునీల్ తెలిపారు. సంజయ్ నగర్కు చెందిన పెట్ల రన్వీర్, జగదీష్పై FIR నమోదు చేశామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం చట్టవిరుద్ధమని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
BDK: పినపాక బీజేపీ మండల అధ్యక్షుడు ధూళిపూడి శివప్రసాద్ను పోలీసులు ముందస్తుగా నిన్న రాత్రి అరెస్టు చేశారు. అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో హైదరాబాద్కు వెళ్లకుండా అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్యపై కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన ఆరోపణలు చేశారు. మరోవైపు చట్టశాంతి దృష్ట్యా చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఘటనపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
KMM: పెనుబల్లి మండలానికి చెందిన బర్మావత్ మోతి కుమార్ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను చాటి విశిష్ట గౌరవాన్ని అందుకున్నారు. పర్వత అధిరోహణలో తన ప్రతిభను నిరూపిస్తూ దక్షిణాఫ్రికాలోని మౌంట్ కిలిమంజారో, రష్యాలోని మౌంట్ ఎలూస్ వంటి ప్రముఖ శిఖరాలను విజయవంతంగా అధిరోహించారు. ఈమేరకు ఆయనకు విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అవార్డును ప్రముఖులు నిన్న విశాఖపట్నంలో అందజేశారు.
WGL: జిల్లా వ్యాప్తంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు 2 నెలలుగా వేతనాలు అందడం లేదు. దీంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు చేసినప్పటికీ చెల్లింపులు ఆలస్యం కావడంతో అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. అధికారులు స్పందించి పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని కూలీలు కోరారు.
KNR: అసెంబ్లీ సమావేశాలను ముట్టడించనున్న బీజేపీ నాయకులను జమ్మికుంట పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న నేపథ్యంలో శాంతిభద్రతల దృష్ట్యా అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. హామీల అమలు కోసం ప్రశ్నించడానికి వెళ్తున్న తమను రాజ్యాంగ విరుద్ధంగా అరెస్ట్ చేయడం సారి కాదన్నారు.
SRPT: రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు ‘అసెంబ్లీ ముట్టడి’కి వెళ్లకుండా నడిగూడెం పోలీసులు ఇవాళ ఉదయం బీజేపీ నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు బండారు వీరబాబు యాదవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అక్రమ అరెస్టులతో ఉద్యమాలను అణచివేయలేదని, ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
కామారెడ్డి జిల్లాలోని భిక్కనూర్ మండల కేంద్రంలోని సిద్ధిరామేశ్వర స్వామి దేవాలయంలో రేపు హుండీలను లెక్కించనున్నట్లు దేవస్థానం ఈఓ శ్రీధర్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయానికి వచ్చిన హుండీ ఆదాయాన్ని అధికారుల సమక్షంలో లెక్కించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు.
ATP: ప్రధాని నరేంద్ర మోదీ దేశ చరిత్రలో అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా సేవలందించి చారిత్రాత్మక రికార్డు సృష్టించారు. ముఖ్యమంత్రి, ప్రధానిగా కలిపి 8,931 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మోదీ దార్శనిక నాయకత్వం కోట్లాది మందికి స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు.
TG: అసెంబ్లీ ముట్టడికి ఇవాళ బీజేపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆరు గ్యారంటీల చట్టబద్ధతను విస్మరించారంటూ నిరసన తెలుపనున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీకి వెళ్లే మార్గాల్లో పోలీసులు మోహరించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అలర్ట్ అయ్యారు. పలువురు బీజేపీ నేతలను ముందస్తు హౌస్ అరెస్ట్ చేశారు.
NLR: పొదలకూరులో ఆదివారం మాజీ మంత్రి కాకాణి పర్యటించారు. ఆయన మాట్లాడుతూ.. ధాన్యం ధరలు రోజురోజుకూ తగ్గుముఖం పట్టడం పట్ల రైతులలో ఆందోళన వ్యక్తమవుతుందన్నారు. ధాన్యం ధర ఇప్పటికే దాదాపు పుట్టి (850 కేజీలు) రూ.4 వేల మేర పడిపోవడం రైతులకు తీరని నష్టమన్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
గుంటూరులోని నేతాజీ నగర్లో పట్టాభిపురం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన ధృవీకరణ పత్రాలు లేని 60 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులకు డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెస్ట్ సబ్ డివిజన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
BHPL: గణపురం మండలం గాంధీనగర్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన మేకల సమ్మయ్య కుటుంబాన్ని సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భువన సుందర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నిరుపేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. అనంతరం బాధిత కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేశారు.