TG: స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయంపై BJLP నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టుకు వెళ్లారు. MLA దానం నాగేందర్ పార్టీ మారలేదన్న స్పీకర్ నిర్ణయాన్ని క్వాష్ చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఏలేటి పిటిషన్పై ఇవాళ హైకోర్టు విచారణ జరపనుంది. కాగా పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఉన్న అందరూ ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
AKP: కశింకోట గవరపేటలో మద్యం మత్తులో గడ్డి మందు తాగి విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న రైతు బీసెట్టి సీతారాం (65) ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు. ఈనెల 20వ తేదీన ఇంటి వద్ద గడ్డి మందు తాగి అపస్మారక స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసి విశాఖ కేజీహెచ్కు పంపించారు.
AKP: కశింకోట గవరపేటలో మద్యం మత్తులో గడ్డి మందు తాగి విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న రైతు బీసెట్టి సీతారాం (65) ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు. ఈనెల 20వ తేదీన ఇంటి వద్ద గడ్డి మందు తాగి అపస్మారక స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసి విశాఖ కేజీహెచ్కు పంపించారు.
TPT: కోట హరిజనవాడలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నకేశ్వర స్వామి గుడి ఎదురుగా ఉన్న బర్రెల దొడ్డి పక్కన పిల్లలు టపాకాయలు పేల్చడంతో నిప్పురవ్వలు గడ్డివాముపై పడి మంటలు చెలరేగాయి. ఎండాకాలం కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. స్థానికులు అప్రమత్తమై వెంటనే బర్రెలను బయటకు తీసి రక్షించారు.పెద్ద ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
BDK: దుమ్ముగూడెం మండలం ప్రగల్లపల్లి పంచాయతీ రామచంద్రాపురంలో నిన్న విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పర్సకా వెంకటమ్మ, కల్లూరి బుచ్చమ్మలకు చెందిన తాటాకు ఇళ్లులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. రాత్రి 7గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు అప్రమత్తమై ఆర్పే ప్రయత్నం చేస్తుండగానే పూర్తిగా కాలిపోయింది. దీంతో బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు.
SRPT: తొలి విడతకు గాను రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. అవి ట్రెజరీలకు చేరాయి. ఆదివారం బ్యాంకులకు సెలవు కావడంతో ఈరోజు ఉదయం నుంచి రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. మొదటి విడత సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 2,84,332 మంది రైతుల ఖాతాల్లో రూ.145 కోట్లు జమ కానున్నాయి. ఎకరా లోపు రైతులకు తొలి విడతలో బ్యాంకుల ద్వారా నేడు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయని.
AP: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.హరిహరనాథ శర్మ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయానికి చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు ఘనంగా స్వాగతం పలికి మూలమూర్తి దర్శనం చేయించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందించగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
WGL: నర్సంపేట డివిజన్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ఛైర్మన్ పిండం లక్ష్మీ రామానంద్ పాల్గొన్నారు. అనంతరం ఆమె క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ… గ్రామీణ ప్రతిభను వెలికితీసేందుకు తెలంగాణ ప్రభుత్వం క్రీడా పాఠశాలలను ఏర్పాటు చేస్తుందని చెప్పారు. క్రీడాకారుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
KMR: బిక్కనూర్ శివారులో హైవేపై ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారును వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో కారు డివైడర్ పైకి ఎక్కింది. అందులో ప్రయాణిస్తున్న నలుగురికి ఎలాంటి గాయాలు కాలేదు. జీఎంఆర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు.
వనపర్తి మండలం పెద్దగూడెంలో నేటి నుంచి 28 వరకు శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని అర్చకుడు రామన్ స్వామి తెలిపారు. 25న సీతారాముల కళ్యాణం, 27న రథోత్సవం, 28న చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ వేడుకలకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.
NLG: హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వెళ్తున్న సాయి అనే యువకుడు కేతేపల్లి మండలం ఉప్పలపహాడ్ వద్ద బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సమాచారం అందుకున్న 108 సిబ్బంది వీరమణి, నాగాచారి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
శ్రీరామనవమి పురస్కరించుకుని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గోట్లూరులో ఈనెల 27న పరుగు పందెం నిర్వహిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం, సత్యసాయి జిల్లాల క్రీడాకారులు ఇందులో పాల్గొనవచ్చు. 2 కిలోమీటర్ల ఈ పోటీలో విజేతలకు రూ. 5016వేల నుంచి రూ.1016 వేల వరకు నగదు బహుమతులు అందజేస్తారు. ఆసక్తి గల వారు ముందే పేర్లు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
AP: రాష్ట్రంలో నెలకొన్న గ్యాస్ సరఫరా సమస్యపై సీఎం చంద్రబాబు ఇవాళ RTGS ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రధానంగా గ్యాస్ కొరతను అధిగమించే మార్గాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రత్యామ్నాయంగా, అవసరమైన చోట తాత్కాలికంగా కిరోసిన్ సరఫరా చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించనున్నారు.
నడుము నొప్పితో బాధపడుతూ KKR ప్లేయర్ ఆకాశ్ దీప్ IPL 2026 సీజన్కు దూరమైన సంగతి తెలిసిందే. దీంతో KKR అతని స్థానంలో విదర్భ పేసర్ సౌరభ్ దూబేని తీసుకుంది. గతంలో అతణ్ని సన్రైజర్స్ హైదరాబాద్ తీసుకున్నా.. డగౌట్కే పరిమితమయ్యాడు. దీంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని అద్భుతమైన డెబ్యూ చేయాలని దూబే భావిస్తున్నాడు.
TG: సిద్దిపేటలోని నర్మెట్టలో నిన్న సీఎం రేవంత్ ఆయిల్పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు భరోసా నిధులను విడుదల చేశారు. అయితే నిన్న బ్యాంకులకు సెలవు కావడంతో ఇవాళ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. తొలి విడతలో భాగంగా రూ.3,590 కోట్లు విడుదల అయ్యాయి. కాగా ఈ పథకం కింద 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందించేందుకు రూ.9 వేల కోట్లను ప్రభుత్వం సమకూర్చింది.