TG: స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయంపై BJLP నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టుకు వెళ్లారు. MLA దానం నాగేందర్ పార్టీ మారలేదన్న స్పీకర్ నిర్ణయాన్ని క్వాష్ చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఏలేటి పిటిషన్పై ఇవాళ హైకోర్టు విచారణ జరపనుంది. కాగా పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఉన్న అందరూ ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.