Gold Rates Today : ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరలు మంగళవారం ఒక్కసారిగా పెరిగాయి. ఇటీవల కాలంలో వంద తగ్గడం లేదా వంద పెరగడం అన్నట్లుగా ట్రెండ్ నడుస్తోంది. అయితే ఈ రోజు దానికి భిన్నంగా ధరలు పెరిగాయి.
Gold and Silver Rates Today : పసిడిని కొనుక్కోవాలని, పెట్టుబడి మార్గంగా మలుచుకోవాలని ఆలోచనల్లో ఉన్న వారు రోజువారీ పసిడి రేట్లను తెలుసుకుంటూ ఉండటం అత్యావస్యకం. మరి ఇవాల్టి బంగారం, వెండి ధరలు ఎలా ఇక్కడ చదివేయండి. దేశీయ మార్కెట్లో సోమవారం పది గ్రాముల పసిడి ధర రూ.65,416గా ఉండగా మంగళవారం మార్కెట్ ప్రారంభంలోనే ఏకంగా రూ.919 పెరిగింది. దీంతో దీని ధర ఏకంగా రూ.66,335కు చేరుకుంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు తదితర ప్రధాన పట్టణాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.66,335గా కొనసాగుతోంది. ఈ ధరలు మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవని గుర్తుంచుకోవాలి. కొనుగోలుదారులు నగల్ని కొనుగోలు చేస్తున్నప్పుడు జీఎస్టీ, మజూరీల్లాంటివి అదనంగా తోడవుతాయని గమనించుకోవాలి.
దేశీయ మార్కెట్లలో వెండి ధరలు(Silver Rate) కూడా మంగళవారం దాదాపుగా వెయ్యి రూపాయల పైనే పెరిగిపోయింది. సోమవారం కిలో వెండి ధర రూ.72,745 ఉండగా, మంగళవారం నాటికి రూ.1,193 పెరిగి రూ.73,938కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరుల్లోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్, సిల్వర్ ధరలు భారీగా పెరిగాయి. సోమవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2,081 డాలర్లు ఉండగా, మంగళవారం నాటికి 32 డాలర్లు పెరిగి 2,113కు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 23.74 డాలర్లుగా ఉంది.