ATP: గుత్తి మండలం తురకపల్లి గ్రామ సమీపంలో గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న మృతుడి ఆచూకీ లభించింది. మృతుడు తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామానికి చెందిన మంగలి ధనుంజయగా గుర్తించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.