KDP: పాములూరు గుట్టలో తాము అన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం, చట్టబద్ధమైన అనుమతులతోనే గ్రావెల్ తవ్వకాలు, రవాణా చేపడుతున్నామని లీజుదారులు వీరభద్రుడు, రమేశ్ తెలిపారు. శనివారం వేంపల్లె CI నర్సింహులును కలిసి అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. వినతిపత్రం అందజేశారు. అధికారులు సంబంధిత రికార్డులను పరిశీలించి తమకు న్యాయం చేయాలని కోరారు.