TG: రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాల కోసం ‘దోస్త్’ 2026-27 నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 15 నుంచి మే 7 వరకు మొదటి విడత రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించారు. ఈనెల 30 నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభం కానుండగా, మే 14న సీట్లను కేటాయిస్తారు. మే 15 నుంచి రెండో విడత, మే 31 నుంచి మూడో విడత ప్రక్రియ ప్రారంభమవుతుంది. డిగ్రీలో చేరాలనుకునే విద్యార్థులు ఈ గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి.