AP: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో 2026-27 సంవత్సరానికి డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే పాలిసెట్ దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని విద్యార్థులు చేసుకోవాలని అధికారులు సూచించారు. టెన్త్ పాసైనవారు, ఇటీవల పరీక్ష రాసిన వారు అర్హులు. ఏప్రిల్ 25న పరీక్ష నిర్వహించనున్నారు. https://apsbtet.ap.gov.in