ఈ ఏడాది జనవరిలో మొత్తం టెలికాం సబ్స్క్రైబర్ల సంఖ్య 78.6 లక్షలు పెరిగి 131.4 కోట్లకు చేరిందని ట్రాయ్ డేటా విడుదల చేసింది. ఇందులో వైర్లెస్ సబ్స్క్రైబర్ల వాటానే 75.7 లక్షలు పెరిగి 126.6 కోట్లకు చేరింది. ఎయిర్టెల్ 44 లక్షల మంది కొత్త కస్టమర్లను సాధించగా, ఆ తర్వాత స్థానంలో 24.4 లక్షలతో జియో నిలిచింది. BSNL 2.71 లక్షల మంది వినియోగదారులను చేర్చుకుంది.