BSNL వార్షికాదాయం రూ.25,000 కోట్లకు చేరినట్లు కేంద్రమంత్రి పెమ్మసాని వెల్లడించారు. సంస్థ ఆదాయం 2024-25లో రూ.23,427 కోట్లు కాగా, 2025-26లో రూ.25,000 కోట్లు మించిందని చెప్పారు. ఇదే సమయంలో ఎబిటా రూ.50 కోట్ల నుంచి రూ.7,000 కోట్లకు సమీపించినట్లు తెలిపారు. నెట్వర్క్ను బలోపేతం చేయడం, ఇతర సంస్థల కంటే తక్కువ టారిఫ్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నట్లు పేర్కొన్నారు.