AP: త్వరలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. మరో డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు కసరత్తు చేస్తోంది. మొత్తం 3,004 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనుంది. అందులో 1744 ఎస్జీటీ పోస్టులు కాగా, మిగితావి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. కాగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 16,347 పోస్టులను భర్తీ చేసిన విషయం తెలిసిందే.