TG: పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు మే మొదటి వారంలో విడుదలకానున్నట్లు తెలుస్తోంది. మే 4 లేదా 5న ఫలితాలు విడుదల చేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. టెన్త్ జవాబుపత్రాల మూల్యాంకనం ఈనెల 1న ప్రారంభమైంది. ఈనెల 23వ తేదీతో ముగుస్తుంది. ఫలితాలు క్రోడీకరించి మే మొదటి వారంలో రిజల్ట్ విడుదల చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.