ప్రకాశం: కంభం మండలంలోని జంగంగుంట్ల గ్రామ సమీపంలో గల జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు గొర్రెల గుంపును ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 గొర్రెలు మృతిచెందగా.. మరో 15 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. దీంతో సుమారు రూ.6 లక్షలు నష్టపోయినట్లు బాధిత రైతు వాపోయాడు. వర్షం కారణంగా రహదారి కనిపించక ప్రమాదం జరిగినట్లు బస్సు డ్రైవర్ తెలిపాడు.