Free electricity, monthly allowances for graduates: Rahul Gandhi
పరువు నష్టం కేసులో దోషిగా తేలిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) లోక్సభ సభ్యునిగా అనర్హుడయ్యాడు. ఈ మేరకు లోక్ సభ వెల్లడించింది. 2019 లోక్ సభ ఎన్నికలకు ముందు కర్ణాటక లోని కోలార్ లో జరిగిన ర్యాలీలో రాహుల్.. సాధారణంగా దొంగలందరి ఇంటిపేర్లు మోడీ అనే ఎందుకు ఉంటాయని వ్యాఖ్యానించారు. పరోక్షంగా ప్రధాని మోడీని ఉద్దేశించి ఆయన ఈ మాటలన్నారు.
కోర్టు ఆఫ్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సూరత్ అతనిని దోషిగా నిర్ధారించిన నేపథ్యంలో కేరళలోని వాయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వానికి అనర్హుడయ్యాడు.
మరోవైపు లోక్సభ సెక్రటేరియట్ ఈ నోటిఫికేషన్ను విడుదల చేసిన నేపథ్యంలో చట్టపరంగా, రాజకీయంగా పోరాడుతామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ ట్వీట్ చేస్తూ వెల్లడించారు. తాము ఇలాంటి బెదిరింపులకు భయపడబోమని అన్నారు.
ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం ఎవరికైనా కూడా రెండేళ్లపాటు శిక్ష పడితే పదవికి అనర్హులవుతారు. అనర్హతకు గురైన వ్యక్తి వచ్చే 8 ఏళ్లపాటు ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేసే అవకాశం ఉండదు. ఇప్పటికే ఈ కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల శిక్షను విధించింది.
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సూరత్ జిల్లా కోర్టు దోషిగా ప్రకటించి రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పు ప్రకటించిన కొద్దిసేపటికే ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రెండేళ్ల జైలు శిక్షపై అప్పీలు చేసుకోవడానికి వీలుగా 30 రోజుల పాటు ఈ ఉత్తర్వులపై స్టే విధించింది.. అప్పీలు దాఖలు చేసేంతవరకు ఈ శిక్షను ఇన్ని రోజులు నిలిపివేస్తున్నట్టు కోర్టు స్పష్టం చేసింది. కోర్టులో రాహుల్ తరఫు వాదించిన లాయర్ జిగ్నేష్.. తన క్లయింట్ ను సమర్థించుకుంటూ ఆయన ఉద్దేశపూర్వకంగా ఆ వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదన్నారు. సాధారణంగా ప్రజలు మాట్లాడే మాటలనే ఆయన ప్రస్తావించారన్నారు. అసలు ఈ కేసులోప్రొసీడింగ్స్ అన్నీ లోపభూయిష్టంగా ఉన్నాయని జిగ్నేష్ పేర్కొన్నారు.