PLD: రొంపిచర్ల మండలంలోని నల్లగార్లపాడులో వరిగడ్డి వామి దగ్దమైన సంఘటన శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, ఆంజనేయులకు చెందిన ఐదు ఎకరాల వరిగడ్డి విద్యుత్ తీగలు తాకి దగ్ధమైంది. రూ.లక్ష మేర నష్టం వాటిల్లినట్టు బాధితులు తెలిపారు. నరసరావుపేట ఫైర్ స్టేషన్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.