కృష్ణా: తాడిగడప సెంటర్ వద్ద సోమవారం విషాదకర ఘటన జరిగింది. ట్రాక్టర్పై వెళ్తున్న పెద్ద ఒగిరాల గ్రామానికి చెందిన ఘంటసాల రాధారాణి (38) ప్రమాదవశాత్తు జారి పడింది. ఆమె తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.