GNTR: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలైన ఘటన గురువారం రాత్రి దొండపాడు సమీపంలోని సీడ్ యాక్సిస్ రోడ్డుపై చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. పనులు ముగించుకొని బైక్పై తుళ్లూరు నుంచి వైకుంఠపురం వెళుతున్న గోపిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గోపి కాలు విరగడంతో పాటు తలకు స్వల్ప గాయమైంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.