ELR: వరుసగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని శనివారం చింతలపూడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఫాతిమాపురం వ్యవసాయ మార్కెట్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో ఒక వ్యక్తి తన బైక్ ను వెనక్కి తిప్పి పారిపోవడానికి ప్రయత్నించాడు. అతనిని పట్టుకుని విచారించగా రాష్ట్రంలో వివిధ పోలీస్ స్టేషన్లలో 35 కేసులు వరకు నమోదైనట్లు సీఐ తెలిపారు.