NLG: పిడుగుపాటుకు రెండు పాడి గెదెలు మృతి చెందింన ఘటన కట్టంగూర్ మండలం కురుమర్తి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొమ్మిడి దామోదర్ రెడ్డి రోజు మాదిరిగానే తన వ్యవసాయ పొలం వద్ద ఉన్న వేప చెట్టుకు బర్రెలను కట్టేశాడు. మధ్యాహ్నం సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుపడటంతో రెండు బర్రెలు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.