AP: ఏలూరు జిల్లా దొరమామిడి డ్యామ్లో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన యువకులు తూ.గో.జిల్లా యదవోలుకు చెందిన రమణ, నాగరాజుగా పోలీసులు గుర్తించారు. యదవోలు నుంచి గుబ్బలమంగమ్మ ఆలయాకి 10 మంది యువకులు వచ్చారు. తిరిగి వస్తుండగా డ్యామ్లో స్నానానికి దిగారు. ఈ క్రమంలో గల్లంతైన ఇద్దరి యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.