AP: నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఓ యువకుడు బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బ్రిడ్జి కిందికి బాలికను తీసుకెళ్లి నిందితుడు అత్యాచారయత్నానికి పాల్పడగా.. బాలిక తమ్ముడు కేకలు వేశాడు. స్థానికులు గమనించి నిందితుడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.