VZM: మానసిక స్థితితో బాధపడుతూ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎస్.కోటలో చోటుచేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ త్రిమూర్తులు వివరాల మేరకు తలారి గ్రామానికి చెందిన చొప్ప నందు(19) స్థానిక ఐటీఐ చదువుతున్నాడు. ఈ నెల 12 సాయంత్రం బయటకు వెళ్తానని చెప్పి ఇంట్లోంచి వెళ్ళాడు. శివాలయం వద్ద గడ్డిమందు తాగాడు. విశాఖ తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.