KKD: సామర్లకోట బ్రౌన్ పేట సెంటర్ సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పేకేటి బ్రహ్మం అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పిఠాపురం రహదారిలోని పెట్రోల్ బంకు వద్ద పశువులకు మేత పట్టుకుని వెళుతుండగా, బొలెరో వ్యాన్ ఆయనను ఢీకొట్టింది. స్థానికులు వెంటనే స్పందించి , ఆయనను సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.