NGKL: లింగాల మండలం చెన్నంపల్లి గ్రామంలో మంగళవారం దారుణం జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాలిలా.. ఎల్లమ్మ కన్న కూతురు నందినిని గొంతు పిసికి చంపి నీటి గుంతలో పడేసింది. ఐదు నెలల క్రితం భర్తను రోకలిబండతో చంపి జైలుకు వెళ్లొచ్చింది. నందిని ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. చిన్నారిని హత్య చేయడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.