ATP: గుత్తి మండలం చెట్నేపల్లి గ్రామంలో శనివారం విద్యుత్ స్తంభాన్ని సిమెంటు లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగి, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే విద్యుత్ సరఫరాను నిలిపివేసి, మరమ్మత్తు పనులు చేపట్టారు. ఆ సమయంలో ఈ రోడ్డు మార్గాన జన సంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.