TG: హైదరాబాద్ గండిపేట చెరువులో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. నార్సింగి PS పరిధిలోని ఇస్తానా విల్లాస్ దగ్గర నీళ్లలో పడి ముగ్గురు మృతిచెందినట్లు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం, పోలీసులు మృతదేహాలను తీసే ప్రయత్నం చేస్తున్నారు. చేపలు పట్టేందుకు వచ్చి చెరువులో పడినట్లు తెలుస్తోంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.